పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

కథలు-గాథలు

వారిలో వివిధకులాల శూద్రజనాన్నిఅరవవారు 'వడుకరు' లు అనగా 'ఉత్తరాదివా'ళ్ళని వ్యవహరించేవారు. ఇందులో రెడ్లు, కమ్మవారు, గొల్లలు మొదలైన కులాలవా రుండేవారు. ఆకాలంలొ మన తెలుగువారు ప్రతివిషయంలోనూ అరవలకన్న చొరవకలవారుగా వుండేవారు, వీరు ఈఫాదరీతొ ఎక్కువ స్నేహంగా వుండి ఆయనను గౌరవించేవారు.

ఈ ఉత్తరాదిజనాన్ని క్రైస్తవమతంలో కలపాలని ఫెర్నాండెజ్ గారు విశ్వప్రయత్నాలు చేశారు. ఏసుక్రీస్తును గురించీ, క్రైస్తవమతధర్మాలను గురించీ అతడు ఎన్నివిధాలుగానో వారికి బోధచేస్తూ వుండేవాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ ఫాదరీగారు ఎంత మంచివాడైనా గొడ్దుమాంసం తిని, మద్యపానం చేస్తూ మాలమాదిగలతో కలిసిమెలసి తిరిగేజాతివాడనిన్నీ, అందువల్ల మతంలో కలిస్తే కులభ్రష్టులమైపోతామనిన్నీ భయపడి ఎవరూ క్రైస్తవ మతంలో కలవలేదు.

కుమారకృష్ణమనాయకుడి తరువాత మధుర రాజ్యాన్ని పరిపాలించిన ముద్దుకృష్ణఫ్ఫ నాయకుడుకూడా క్రైస్తవమత ప్రచారకులతో స్నేహంగానే వుండేవాడు. ఇది విని పోర్చుగల్లుదేశపు రాజుకూడా సంతోషించినట్లు ఉత్తర ప్రత్త్యుత్తరాలవల్ల కనబడుతూవుంది. ఇలాగ 12 సంవత్సరాలు ఫెర్నాండెజ్ ఎంతకష్టపడినా క్రైస్తవమతం వ్యాపింపలేదు.

రా బ ర్టో డీ నొ బి లీ

ఈ పరిస్థితులలో రాబర్టో డీ నొబిలీ అనే క్రైస్తవ మతప్రచారకుడు 1606 లో మధురానగరానికి వచ్చాడు. నొబిలీ ఇటలీదేశంలో మాంటీ పుల్చియానో అనే గ్రామంలో క్రైస్తవ మత గురువైన పోపులకు బంధువులైన గొప్ప కుటుంబంలో 1577 లో జన్మించారు. అతడు చిన్నప్పటినుంచీ తెలివైనవాడు. తన పదవయేటనే ఐరోపా దేశపు సంస్కృతభాష లనదగిన గ్రీక్ లాటినులను ధారాళంగా మాట్లాడేవాడు. నోబెలీ ఇక్కడి రాగానే మత ప్రచారం