పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగద్గురు తత్త్వబోధ స్వామి

49


ప్రచారకులైన జెస్సూటమిషనరీ ఫాదరీలను ఆదరించి గౌరవించేవారు క్రైస్తవ దేవాలయాలు కట్టుకోవడానికి, పాఠశాలలు స్థాపించడానికి మత ప్రచారం చెయ్యడానికి అనుజ్ఞ నిచ్చేవారు.

చోళమందలంలో సముద్రతీరాన్ని ఉండే పరవరులనే పల్లెకారిజనంలో చాలా మందిని పోర్చుగీసు క్రైస్తవమత ప్రచారకులు రోమను క్యాతలిక్కు మతంలో కలిసినదువల్ల వాళ్ళ క్షేమంకోసం పోర్చుగీసు క్రైస్తవ మతాధికారు లొక మిషనరీ ఫాదరీని నియమించారు. ఇందుకోసం నియమింపబడిన జెస్సూటు క్రైస్తవమిషనరీ అయిన 'గొంజాలో ఫెర్నాండెజ్ ' అనే ఫాదరీ 1569 లో మధురానగరానికి వచ్చి అక్కడ తన నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పుడు మధుర రాజ్యాన్ని పరిపాలించే సామంతమండలేశ్వరుడైన కుమార కృష్ణప్ప నాయుడు ఆఫాదరీని ఆదరించి మధురలో ఒక క్రైస్తవ దేవాలయం కట్తుకోడానికి అనుజ్ఞ నిచ్చాడు. ఇలాగ పాండ్యరాజధానిలో క్రైస్తఫమత ప్రచారం చెయ్యడానికి అవకాశం ఒకటి ఏర్పడింది. ఫెర్నాండజ్ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవాడు. ఏదో ఓక సందర్భంలో ఏసుక్రీస్తును గురించి చెప్పుతూఉండేవాడు.ఆయన మంచితనమూ, సద్గుణములూ, బ్రహ్మచర్యవ్రతమూ చాలామందిని ఆకర్షించింది. చాలామందికి ఆయనపై సదభిప్రాయం కలిగింది. అంతట ఆయ;న సంగతి తెలుసుకుందామనీ, ఆయన క్రొత్తమతం సంగతి తెలుసుకుందామనీ కుతూహలం తో కొందఱు బ్రాహ్మణులుకూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. ఆయన యింటి దగ్గర మతధర్మాలను గురించి శస్త్రచర్చలు తరుచుగా జరుగుతూ ఉండేవి. ఈ జెస్సూటు మతప్రచారకుడు త్వరలోనే ఒక ఆసుపత్రిని స్థాపించి అక్కడ క్రైస్తవులకే గాక ఇతరులకు కూడా మంచి మదులిచ్చి చికిత్సలు చేసేవాడు.

ఉత్తరాది తెలుగు జనము

అప్పట్లో మధురరాజ్యములో అన్నివర్గాలలోను తెలుగువారు చాలామంది ఉండేవారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగు