పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తికి శిక్షవిధించిన దివానులు

27


సంబంధించిన కాగితాలు పైఅధికారులదగ్గర చాలా నెలలనుంఛి పడివున్నాయి. ఆవుద్యోగి ముసలివాడు. అయ;న జబ్బుమనిషి బహుశా ఈయన వ్యవహారం ఫైనలు అయ్యేలొపుగానె స్వర్గస్థుడయి విముక్తి పొందుతాడేమో అని స్మాలెట్టు గారు వ్రాశారు.

ఈగంజాం హెడ్దు శిరస్తాదారుమీద మోపిన నేరాలలో చెన్నపట్నం రాజధానిలో శిరస్తాదారు ఉద్యోగం చేసేవారు వహించేదానికన్న యెక్కువ దర్జాగల గౌరవాచకాన్ని తన పేరుతో కలిపి వాడుతున్నా డనే నేరం ఒకటి! ఇంకా ఇలాంటి పనికిమాలిన నేరాలు కొన్నింటిని మోపారుగాని ఆపాదించిన దోషాలలో ఒక్కటైనా సరియైన సాక్ష్యంతో రుజువుపరచడానికి ప్రయత్నించలేదు. ఈ అక్రమాన్ని గురించి ఈగంజాంజిల్లా శిరస్తాదారుగారు ఇంగ్లాండులో కంపెనీ డైరెక్టర్ల కోర్టువారికి అర్జీ యిచ్చుకొగా ఆయనకు పూర్తిఫించను ఇచ్చేటట్టు వారు వుత్తరువు చేశారు.


3.చక్రవర్తికి శిక్ష విధించిన దివానులు

ఈ దేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన ఇంగ్లీషువారు 1765 లో అప్పటి మొగలాయి చక్రవర్తియైన షా ఆలం పాదుషాను ఆశ్రయించి వంగరాష్ట్రములోను బీహారు ఒరిస్సాపరగణాలలోను చక్రవర్తి ప్రతినిదులుగా శిస్తులు వసూలు చేసి, సివిలు పరిపాలన జరిపే 'దివానిగిరీ ' ఆధికారాన్ని సంపాదించడంతో రహస్యంగా ప్రారంభమైన బ్రిటిషు రాజ్యతంత్రము 1858 లో జరిగిన సిపాయిల విప్లవమనే స్వాతంత్రము యుద్ధంలో పాల్గొని ఐరోపావారి వధలకు మద్దతుచేసినాడనే నేరం మోపి అప్పటి మొగలాయి చక్రవర్తియైన బహదూరుషా పాదుషాను పట్టుకుని యావజ్జీవ కారాగార శిక్షవిధించి రంగూనులో నిర్భంధించి ఇండియాలో కంపెనీపరిపాలనను రద్దుచేసి ఇంగ్లీషు రాణీ ప్రభుత్వము ప్రకటించడంతో స్ధిరరూపం దాల్చింది.