పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

కథలు - గాథలు

కర్నూలునవాబు పదచ్యుతి

ఆప్ఘనిస్థానం యుద్దంలో ఇంగ్లీషువాళ్లు ఓడిపోతారని అనుకుని దేశంలోవున్న మహమ్మదీయు లందరూ ఏకమై తిరుగుబాటు చేయడానికి కుట్రచేసినట్లూ, దానికి కర్నూలు ఒక కేంద్రస్థాన మైనట్లుగా తేలింది. "మన కళ్ల యెదుటనే ఇలాంటి గొప్పకుట్రసాగుతూ వుండడమూ, దానికి సొమ్ము చేకూరడమూ ఎంత ఆశ్చర్ల్యము!"అని దీనినిగురించి ఇంగ్లాండుకు వ్రాసిన ఆయన అన్నాడు.

కర్నూలు నవాబు గులాం రసూలుఖానును పదభ్రష్టుణ్ని చేసి తిరుచినాపల్లికి రాజకీయఖైదుగా పంపారు. అక్కడ అతడు క్రైస్తవ మతంలొ ఆసక్తి చూపుతూ క్రైస్తవదేవాలయానికి వెళ్లగా ఒక తురకఫకీరు ఆయనను 1840 వ సంవత్సరం జూలై 12-వ తేదీన కత్తితో పొడిచి చంపాడు. (South Indian Sketches A short account of some missionary stations of Church Mission Society by S.Tucker, James NIsbel & Co; 1842 pp 17-23)

-------

12. మంగలి కొండోజీ

   క॥ "ఎంగిలిముచ్చుగులాములు
        సంగతిగా గులము చెఱుప జనుదెంచి రయా
        యింగిత మెరిగినఘను డీ
        మంగలికొండోజి మేలు మంత్రులకన్నన్."

అని కంసాలి రుద్రయ్య యని ప్రసిద్ధిజెంచిన కందుకూరి రుద్రకవి చెప్పిన చాటుపద్య మొకటి చిరకాలమునుంచి ప్రచారంలో వున్నది.

ఈ రుద్రకవి విద్యానగరసామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలంనాటివాడనిన్నీ, ఇతడు రాయలవారి దర్శనంకోసం చాలాకాలం వేచియుండి మంత్రులనూ, రాజోద్యోగులనూ ఎన్నాళ్లు