పుట:Kasiyatracharitr020670mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు

నాటి పరిపాలనకోసం చెన్నపట్నం సుప్ర్రీంకోర్టులో ఒక్క స్కీము తయారుచేయిచాను. ఆ ప్రకారం 1832 లో ఏర్పాటు చేయవడిన మొదటి ధర్మకర్తల బోర్డులో శ్రీనివాస పిళ్ళె గారి నొక ధర్మకర్తగా నియమించారు. ఆ బోర్డుకు శ్రీ వెంభాకం రాఘవాచార్యులుగారు అధ్యక్షులుగావున్నారు. ఆయన 1842 లో చనిపోగా శ్రీనివాసపిళ్ళెగారే అధ్యక్షులై 1852 వారుచనిపోయేవరకు ఆపదవిలో వున్నారు. జార్జినార్టన్ గారు పేట్రన్ గా వుండి పచ్చయ్యప్పకళాశాల స్తాపనకూ అభివృద్దికీ మూల కారకులలో ఒకరైనారు.

కుంపినీ పరిపాలన ప్రజల స్థితి.

1835 వరకూ యీదేశంలో ఇంగ్రీషు విద్య స్తాపింపబడలేదు. ప్రజలలో అజ్ఞానం చాలా వ్యాపించివుంది. కుంపినీవారు కేవలం రాజ్యాక్రమణంలోను వ్యాపారం లోను పన్నుల వసూలులోను మునిగి తమ లాభమే ఆలోచించేవారు గాని ప్రజల కష్టసుఖాలను గురించి యోచించేవారుకాదు. పూర్వ గ్రామ పంచాయతీల పరిపాలన తీసివేసి కలక్టర్ల పరిపాలన స్తాపించారు. ఈ కుంపినీపరిపాలనలో ప్రజలు దరిద్రులై, విద్యలేక అగ్జానాంధకారం లోను అనారోగ్యంలోను పడి వుండడము, రాక పోకలకు రోడ్లు, పల్లపు సాగుకు సౌకర్యాలు లేకపోవడము, పన్ను లివ్వలేనివారిని హింసించడము, కలెక్టరులు నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము కోర్టుల యప్రయోజకత్వము క్రైస్తవ మతబోధకుల విజృంభణములవల్లను ఇంకా ఇతర అన్యాయాల వల్లను ప్రజలు బాధపడుతూ వుండే వారు. కొంత ఉదారబుద్ధి గలిగి విద్యాభివృద్ది చేయ దలచిన చెన్నపట్నం కాస్త మంచి ప్రయత్నం కూడా ఆగిపోయింది.

మనదేశప్రజలను ఇంగ్లీషు వారిని చూస్తేనేభయం, తమహక్కులెలాంటివో తమ కష్టాలు అవిరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలోకూడా తెలియదు. వీరికి దారిచూపించే రాజకీయ నాయకులున్నూ లేరు.

హిందూ లిటరరీ సొసైటీ,

ఇలాంటి పరిస్థితులలో ప్రజలలో కొంత చైతన్యమూ విజ్ఞాన్ వికాసమూ కలిగించాలని ఏనుగుల వీరాస్వామయ్య గారు, రాఘవాచార్యులు గారు, శ్రీనివాస పిళ్ళెగారున్నూ కలిసి జార్జి నార్టనుగారి నాయకత్వం కింద చెన్నపట్నంలో హిందూలిటరరీ సొసైటీ అనే ప్రజాసంఘాన్ని స్తాపించి సభలు చేసి ఉపన్యాసాలిప్పించే గొప్ప కృషిచేశారు. ఈ సభ ఆదరణకింద దేశ చరిత్రను గురించీ, ప్రజల హక్కులను గురించీ నార్టను గారు 1833-34 మధ్యకొన్నిమహోపన్యాసాలిచ్చారు. అందువల్ల చెన్నపట్నం ప్రజలలో రాజకీయ పరిజ్ఞానం కలిగింది. ప్రజలు ఇంగ్లీషు విద్య కావలెనని కుంపినీవారిని కోరడం ప్రారంచించారు.