పుట:Kasiyatracharitr020670mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర: తృతీయ ముద్రణం - పీఠిక

వీరాస్వామయ్యగారు జార్జి నార్టనుగారు, రాఘవచార్యులు గారు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళెగార్ల పటములుగల ఫొటోబ్లాకును శ్రీ పచ్చయ్యప్ప కళాశాల ధర్మాధికారులు యిచ్చినారు.

ఈగ్రంధంలో చేర్చిన రాజకీయ సాంఘిక చరిత్రాంశాలు, వివరణలు, ఫుట్ నోట్సు వ్రాయడానికి అనేక పురాతన పుస్తకాలు చదవవలసివచ్చింది. మద్రాసు కనామెరాలైబ్రరీలొవున్న ఆ;పుస్తకాలను బెజవాడ రామమోహన గ్రంధాలయం ద్వారా తెప్పించుకోగలిగాను.


శ్రీ నాగళ్ళ భవానీ శంకరనాయుడుగారున్నూ, శ్రీరేకపల్లి విశ్వనాధం గారున్నూ, శ్రి మాడపాటి లక్ష్మీకాంతారావుగారున్నూ, నాగుమాస్తా శ్రీ వల్లూరు వెంకట కృష్ణారాఫున్నూ యీ పుస్తకం వ్రాత వగైరాపనిలో నాకు చాలాసహాయం చేశారు.

యుద్దంవల్ల కాగితం ధర ఎక్కువ అయినది. గ్రంధముద్రణ చాలా ధనవ్యయకారణమైంది. దీనిని అచ్చువేయడాని కీక్దింద పేర్కొన్నవారువిరాళాలుయిచ్చారు.

శ్రీ పల్లేర్లమూడి పద్దయ్యగారు, యనమదల (కృష్ణాజిల్లా) రు. 50 శ్రీ మాజేటి నాగభూషణం గారి భార్యా కనకమ్మగారు, బెజవాడ " 50 శ్రీ పాటిబండ అప్పారావుపంతులుగారు, బి.ఏ.,భ్.యల్;బెజవాడ " 50 శ్రీ తోటకూర వెంకట్రాజుగారు, తాడేపల్లిగూడెం " 50 శ్రీ బసవరాజు సూర్యనారాయణరావు పంతులుగారి కుమారుడు శ్రీ సుబ్బారావు పంతులుగారు, బెజవాడ. " 30 పైవిధంగా సహాయం చేసినవారందరికి కృతజ్ఞుడను

బెజవాడ, దిగవల్లి వేంకటశివరావు, 2-9-1941 స్ంపాదకుడు.