పుట:Kasiyatracharitr020670mbp.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేస్తూవుండడమువల్ల సౌఖ్యముగా వచ్చి యీ బ్రంహ్మోత్సవాన్నిన్ని వేడుకపరచి తాము ఆనందపడిపోతూ వుంటారు. యీవూళ్ళో చెన్నపట్నము వుపసంపన్నులు అనేకసత్రాలు కట్తివున్నారు. విశాలమయిన వీఢులు కలవి. వీధులు టెంకాయచెట్లశాలల వల్లను బయిటితిన్నలు పందిళ్ళచేతనున్ను అలంకరించబడివున్నది. సుందరమయినచేవాలయము తటాక సహిరముగా వున్నది. సమస్తపదార్థాలు దొరుకును. యీవూరు తోటల చేత ఆవరించబడి వున్నది. యీ గుడిధర్మము లింగిశెట్టి కుమారుడైన అరుణాచలశెట్టి తనచేతి సొమ్ము సంవత్సరానకు 2000 వర్హాలదాకా ఖర్చు చేసి జరిగింపుచున్నాడు. ఆ ధర్మము కాక అతను వేశివుండే, తోట కట్టివుండే సత్రమున్ను సుందరముగా వున్నది. అతను అన్నదానాపేక్ష చాలా కల వంశములో జనించినాడు గనుక ఆవాసన యీ పురుషుణ్ణి బాగా పట్టి వున్నది.

యీ స్థల మహాత్మ్యము యేమంటే సృష్టికి ఆదియందు భూమి జలార్ణవమై వుండగా యీశ్వరుడు సృష్టికి అంకురముగా వొక ఔదుంబద వృక్షము కలగచేసి చండవాయువుచేత ఆవృక్షమును యుక్త ప్రదేశములో నిలువుమని పంపించి నట్టున్ను ఆ వృక్షము యీ ప్రదేశములో నిలువుమని పంపించినట్టున్ను ఆ వృక్షము యీ వూళ్ళో పతనమై పాతాళలోకము అంటినట్టున్ను అక్కడ వుండే ఆదిశేషుడు ఆవృక్షాన్ని పోషింపుచువచ్చునట్టున్ను దాన్ని వేళ్ళ పుష్టి భూమిని అప్పట్లో ఆవరించి భూమి మీద వుండే వుదకాన్ని పానము చేసి భూమిని బయిలు పడతొశినట్టున్ను అప్పట్లో వినాయకుడు మొదలయిన ఆవరణ దేవతలు ఆ చెట్టు కింద ప్రవేశించినట్టున్ను ఆదిశేషుడుకూడా వొకపుట్టను యిక్కడ కల్పించుకొని వసింపుచున్నట్టున్ను అటుపమ్మట యీ స్థలములో వసించగలందులకు పార్వతిని తెమ్మంటే సృష్టి స్థితి సంహారములలో అధికారము తనకుకూడా యివ్వక గాని తాను రానని చెప్పినట్టున్ను పిమ్మట యీశ్వరుడు అదేప్రకారము అధికారము యిచ్చి పార్వతిని వెంటపెట్టుకుని ఆది శేషునివల్ల పూజింపబడి అతను కట్టుకునివున్న వల్మీకములోనే ప్రవేశించి అద్యాపి వుండేటట్టున్ను పార్వతీ దేవిన్ని త్రిపురసుందర్యాకారము వహించి సృష్టిస్థితి సంహారాధికారము చేయుచూ యిక్కడ విలశిల్లి వుండేటట్టున్ను