పుట:Kasiyatracharitr020670mbp.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్పది. 1000 యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుడుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఃఘాటువద్ద వుంచి వున్నారు. యాత్ర వారి సమేతముగా పండాల విచారణ ఆ దొరల పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నైవేదనార్హములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో నెయ్యనివ్వరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనె సాహుకారులు యీ వూళ్ళో లేదు. సమస్త పదార్తములు దొరుకుచున్నవి. యూవూరు సముద్రతీర మందున్నది. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతుల వాండ్లు సముద్రతీరమందు యిసక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్టచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములొ వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్చినది. ఆకూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పొను భయపడుతూ వుంటారు. పాత మూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలాలలో ప్రవేశింప పెట్టినవనక రెండుమూడు నెలలలో ప్రవేశింపపెట్టిన వృద్ధ కొరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దాని కారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తోచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నది. యిక్కడ అనేక మఠాలున్ను రోగిష్ఠులకు ప్రసాదవినియోగమయ్యేకొరకు కుంఫ్హిణీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినముముందు పిలిస్తేపండితులు పామరులు సహా