పుట:Kasiyatracharitr020670mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

పూరినుంచి గంగ దాటేటప్పుడు ప్రవాహము తీసి వుండేయిట్టికాలాలలో నడమ మిట్ట పెట్టి వుంటున్నది గనుక నడమ పడవదిగి మిట్టకవతల మళ్ళీ పడవ యెక్కి ప్రయాగలో దిగవలసింది. రెండుమాట్లు యెక్కి దిగే ప్రయాస లెకుండా యీవూరునుంచే యమునానదిలో నా పడవలు పొయ్యేటట్టు చేసి ఒకసారిగానే ప్రరయాగలో పెరిమిట్టు ఘాటులో దిగినాను. యిక్కడ మనిషికి 1కి పయిసావంతున ఘాటుసుంకము పడవ దాటడానికి యియ్యవలసినది. యీ ఘాటుసుంకము సాలుకు 26.000 రూపాయిలు లెక్క యిజారాకు యిచ్చివున్నారు. 12 ఘంటలకు త్రివేణి దర్శనమిచేసి స్నాన క్షౌరాదులు చేసుకోవడమయినది.

యీ ప్రయాగ మహత్మ్యమేమంటే జగత్సృష్టికి ముందు పరమాత్ముడు బాలరూపాన్ని ధరించి యీస్థళమందున్న అక్షయవటవర్ణ ముమీవసింది వుండినాడు. యీమూల వటము యెన్నటికి క్షయమును పొందనిది గనుక అక్షయవట మనే నామము కలిగినది. ఈ అక్షయవటమే బ్రహ్మస్వరూపమని పొరాణసిద్ధము. పిమ్మట జగత్సృష్టి అయిన వెనకకూడా ఈ అక్షయవటము సువర్ణమయమై బహుకాలముశోభిస్తూ వుండినది. మాధవమూర్తి కూడా యీ వటవృక్షాన్ని అనుసరించి యిక్కడ విరాజమానుడయి వున్నందున యీ స్థళము బహు పుణ్యస్థల మయినది. తద్ధ్వారా యీ పుణ్యస్థలములో చేశే సుకర్మాలు అక్షయఫలప్రదములౌననే తాత్పర్యముతో పూర్వము బ్రహ్మ యిక్కడ దశాశ్వమేధాలు జేసినాడు. ఆ ప్రదేశము యిప్పటికి యిక్కడ దశాశ్వమేధఘట్ట మని ప్రసిత్థి పడి వున్నది. ఈ దశాశ్వమేధాలు చేసినంతలో మాధవమూర్తి బ్రహ్మకు ప్రసన్నుడయి యిచ్చయించిన వరమిస్తానని వాగ్దత్తము చేసినాడు. గనుక బ్రహ్మ యీ మహాస్థలము విష్ణు క్షేత్రమని యిదివరకు ప్రసిద్ధమై యున్నదికదా; యికమీద నాపేరుకూడా యీస్థళానికి సంబంధించి వుండేటట్టు చేయవలెనని ప్రార్దించినాడు. మాధవమూర్తి అదేప్రకారము కటాక్షించి యికను లోకులు యీ క్షేత్రాన్ని విష్ణు ప్రజాపతి క్షేత్రమని వాడుకుందురుగాక అని నియమించినాడు. అది మొదలుగా యీస్థళాని విష్ణుప్రజాపతి క్షేత్రమని వాడు కుంటున్నారు.