పుట:Kasiyatracharitr020670mbp.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

నాలు యేమి వున్నా కాళీ సన్నిధానమందు జరిగిస్తారు. పునశ్చరణలు యోగమాయ సన్నిధానమందు చేస్తారు. రాజోపచార పూజలు భోగ మాయ ముందుగా జరుగుచున్నవి. గుడి చిన్నది గాని ప్రసిద్ధికి తగ్గ బాహుళ్యము గలది కాదు.

యీ స్థల మహాత్మ్య మేమంటే యశోదాగర్బజనిత యయిన యోగమాయ కంసునివలన తప్పిందుకొని యీ పర్వతముమీద వసింది పిమ్మట శ్రీకృష్ణమూర్తి చేత సంహరింప బడక నిలిచిన రాక్షసులను జంపుటకై దేవతల ప్రార్ధనచేత మహాకాళీరూపము ధరించి భూభారాన్ని మాంపి మళ్ళీ సాంబమూర్తి సన్నిధాన ప్రాప్తిని గురించిన ఆపేక్షచేత ఆ ఉగ్రస్వరూపము వదిలి భోగశక్తి అయినట్టు చెప్పుచున్నారు.

యీ వింధ్యవాసినీ మహాత్మ్య మేమంటే యిటీవలనే కాశిలోనుంచి ఒక పురుషుడు తెచ్చి ఈ స్థలములో ప్రసిద్ధి చేసినాడు; ఈ వింధ్యవాసినికి సమీపమందు రామగయ అనే ఒక ప్రదేశమున్నది. అక్కడ పిండప్రదానాలు ముఖ్య మనిన్ని, యీ వింధ్యవాసినీ క్షేత్రముయొక్క పంచక్రొశము ముక్తిప్రదమనిన్నీ, యీ స్థల పురాణప్రసిద్ధము. ఈ శక్తికి నా వంటి వారు ఆరాధన చేయించ వలసితే వస్త్రమున్ను అంగుళీయకమున్ను వెండి చిన్న మధుపర్క పాత్రయున్ను యివి మొదలయిన అగత్యముగా ఇయ్యవలసినవి. బ్ర్రాంహ్మణ భోజనము చేయించడమని ఒక సంప్రదాయము ఇక్కడ కలదు. అది యేలాగంటే మిఠాయి వాండ్లను పిలిచి కచ్చారసూయి అనే పూరీలు చేయించి దూదుఫేడాలు బరిఫీలు బత్తాసాలు తీసి ఈ పండ్యాబ్రాంహ్మణులకు ఆకులు వేసి వడ్డిస్తే మనము దిగివుండే తావుకువచ్చి తింటున్నారు. గట్టిపెరుగుకూడా వడ్దించవలసినది. మనిషికి ఒక కొత్త పిడత రాహము పుచ్చుకొవడానికి తీసి యివ్వవలసినది. నూటికి సుమారు 20 రూపాయిలు పట్టుచున్నది. భోజానంతరము ఒక పట్టి తాంబూలము రెండేసి అణాలు ఇస్తే ఆనందింపుచున్నారు.

ఈ దేవిని వారు తాకి పూజచేయవచ్చును గనుక నా