పుట:Kasiyatracharitr020670mbp.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

చేతపట్తుకొని వచ్చి గట్టునవుంచి స్నానముచేసి తడిగుడ్డతో ఆ వస్త్రముమీద గంగను ప్రొక్షించి యెత్తి కట్టుకొనుచున్నారు. ద్రావిడ దేశస్థులకు గంగ పరమపావని యనే భక్తికలిగి యున్నా మడిసంచిలో మడుగువస్త్రమును వుంచుకోవలెనన్న బుద్ధి పుట్టుచున్నది. గాని యీ దేశస్థులవలె చేతపట్టుకొని పోయి గంగాజలముచేత పవిత్ర పరచే నమ్మికె పట్తుబడినది కాదు. మరిన్ని ద్రవిడదేశాములో మడుగు వస్త్రమును ఒక కొయ్యతొ యెత్తుకొనివచ్చి నా తాడుకు కట్టి ఆతాడు కొన పట్తుకొనివచ్చినా అది మడుగనే నమ్మికె కలిగి యున్నది. యీ దేశాచార భేదములను చూచి యోచించగా ఈ నియమాలంతా మనోబంధకాలేగాని వేరేగాదని రూఢిగా తోచుచు వచ్చుచున్నవి.

ఇది మొదలు కుంఫిణీవారి రాజ్యము గనక రహదారిలేక ఆయుధాలు పట్టనియ్యరు. ఇక్కడికి కాశి 22 కోసులు; వింధ్యవాసినీ స్థలము 2 కోసులు. ఇక్కడ గంగాదర్శనమయి నందున క్షౌరము తీర్థోపవాసము హిరణ్యశ్రాద్ధము మొదలయిన పితృక్రియలు చేసినాను. ఈషహరులో అన్నివిధాల పనివాండ్లున్ను వున్నారు. అన్ని పదార్ధాలున్ను దొరుకును. నాపరిజనానికి చింతపండు మిరపకాయ మొదలయిన ద్రవిడదేశపు వస్తువులు కూడా సమృద్ధిగా గొరికినవి. అరిటి చెట్లుమాత్రము ఈప్రాంతములలో లేవు. యింగిలీషు దొరలు గంగగట్టున యిండ్లుకట్టుకొని యున్నారు. ఈ షహరు చెన్నపట్టణమంత వుండునని తోచుసున్నది. ఇక్కడి తమలపాకులు రామటెంకి తమలపాకులకంటే బాగావున్నవి. నాపరిజనులకు జ్వరమువాశి అయ్యె దాకా ఇక్కడ వుండి ప్రతిదినమున్ను గంగాస్నానము చేయుచువచ్చినాను. నర్మదానదికి ఇవతల పున్నమిపోయిన పాడ్యమి మొదలుగా మాస ప్రవేశము గనుక ఇక్కడ నిన్న మొదలు కార్తిక మాసారంభమమయినది. కృత్తికాస్నానాలు గంగలో ముఖ్యము గనుక జగదీశ్వరుడు నాకు గంగలో ఆ స్నానాలు కలిగేలాగు కటాక్షించినాడు.

26 తేది మొదలు అకుటోబరు 7 డో తేదివరము మిరిజాపురములో నివాసముచేసినాను. కూడావఛ్ఛిన పరిజనులలొ 20 కి చలి