పుట:Kasiyatracharitr020670mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

యేనుగుల వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిన లేఖ.

ఈ పుస్తకం ప్రకటించడంలో దీనివల్ల నేను లాభము పొందదలచడం లేదని మవవిచేస్తున్నాను. దీని ప్రతులను అమ్మడంవల్ల వచ్చే లాభాన్ని ఇచ్చివేయడానికి నాకు యేలాంటి అబ్యంతరమున్నూ లేదు. నష్టమైనా వస్తే నేనే భరింపగలను. నష్టము రాదనే నాదృఢవిశ్వాసము.

నేను మచిలీపట్టణముననున్న కాలంలో తాము నాయెడల చూపిన దయకు నా కృతజ్ఞతాభినందనాలు స్వీకరించగోరుతాను. ఈయూరినుంచి తమకేమికావలసినా నాకు తెలిపితే నేను ఆపనిని జాగ్రత్తగా చేస్తాను.

ఇలాగ చనవు తీసికొన్నందులకు క్షమింపవేడుతూ తమ యారోగ్యముకొతకు సౌఖ్యముకొరకు పరమేశ్వరుని ప్రార్ధిస్తూ అతిగౌరవ పురస్పరంగా విరమించు తమవిదేయుడు, అనుగ్రహపాత్రుడు, భృత్యుడు.

                                          (Y)  యే. వీరాస్వామి
                                        అని ఇంగ్లీషుసంతకం వున్నది.

తాజాకలం.

ప్రస్తురం స్టోనుహౌసు దొరగారివద్ద వున్న నాతమ్ముణ్ణిగురించి నేను తమ్మువేడుకున్న విషయంతో జ్జ్ఞాపకం చేస్తున్నాను.

                                             (Y) యే.వీరాస్వామి.
                                           అని ఇంగ్లీషు సంతకము వున్నది.

ఈజాబుపైన సి.పి.బ్రౌనుగారి నోటు:

'ఆ పుస్తకాన్ని ప్రకటించడానికి ఇంకా సిద్దంగా లేమనిన్నీ ఆపుస్తకమును పంపితే చూస్తాననిన్నీస్కాందమును ఈకింది భాగాలను తెనిగించేపని ప్రస్తుతము నిలుపు తున్నామనిన్నీ, సూతసంహిత నావద్ద నున్నదనిన్నీ తెలుపుతూ 1889 జనవరి 25 వ తేదీన జవాబువ్రాడమైనది' అని యున్నది.


కాశీయాత్ర వ్రాత ప్రతి 455 పుటలో, మచిలీబందరునుగూర్చి వ్రాస్తూ "నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లీ అనే తాలుకాకు పనిఅయింన్నీ నాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు" అని వీరాస్వామయ్య గారు వ్రాశారు. బహుశ: పైవుత్తరంలో వుదహరించిన 'తమ్ముడు' అతడే అయి యుండవచ్చును.