పుట:Kashi-Majili-Kathalu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కాదంబరి

గీ|| కలికి తత్కాలజనిత శోకప్రవృత్తి
    బ్రియవయస్యనుఁ జూచుచుండియుఁ గడంక
    నాపలేదయ్యఁ దనచూపు లతనిమీదఁ
    బడక యుండఁగ నెన్ని యుపాయములను||

అశ్రుజలపూరితనయనయై యజ్జలజనయన ముహూర్తకాల మూరకొని యంతలోఁ దనకుఁ దాంబూలమీయఁబోవుఁడు వారించుచు మహాశ్వేత యిట్లనియె. సఖీ! మనమందరము క్రొత్తచుట్టమైన యీరాజకుమారు నారాధింపవలయును. కావున ముందుగా నతనికిఁ దాంబూల మిమ్మని పలికిన విని యక్కలికి యించుక యడ్డముగా మొగము వంచి సన్ననియెలుంగున ప్రియసఖీ! పరిచయము లేకపోవుటచే నిచ్చుటకు నాకు సిగ్గగుచున్నది. దీనింగైకొని నీవే వారికిమ్ముఅనవుఁడు మహాశ్వేత ముఖరసనా చలన సంజ్ఞచేవారించుచు నట్లనకుము. నీవే యీయవలయునని పలుమారు బోధింప నెట్టకే యంగీకరించినది.

మహాశ్వేత మొగమునుండి దృష్టుల నాకిష౯ంపకయే మేను గంపమునొందఁ గన్నులుమూసికొని నిట్టూర్పులు నిగుడించుచు నొడలంతయుఁ జెమ్మటలు గ్రమ్మ సాధ్వసపరవశయై యతిప్రయత్నముతో నప్పల్లవపాణిఁ తాంబూలగర్భ హస్తపల్లవము చాచినది.

అప్పుడు చంద్రాపీడుండును ధనుర్గుణాకర్షణకృత కిణశ్యామలమయ్యు స్వభావపాటలమై యరుణనఖకిరణ లలితములగు నంగుళులచేఁ బొలుపొందు కరతలంబు తాంబూల మందికొనుటకై చాచెను.

అప్పుడు తద్విలాసములం జూచుటకు వేడుకకలవియుం బోలె నెక్కడినుండియోవచ్చి రసములన్నియు నామెయందుఁ బ్రవేశించినవి.

శ్వేదజలపాతపూర్వకముగా మన్మధునిచేత నీదాసజనము నీకీయఁబడినది. స్వీకరింపుమని తన్నర్పించుకొనునట్లు ఇది మొదలు