పుట:Kashi-Majili-Kathalu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

కాదంబరి

వ్యసననిపాతములు దుర్నివారము లైనవికదా? మనోహరమగు నిటువంటి యాకృతులను సైతము దమవశముఁ జేసికొనుచున్నయవి. శరీరధర్మముగలవారి నుపతాపము లంటకమానవు. సుఖదుఃఖముల యొక్క ప్రవృత్తిబలమైనది. ఈమెగన్నీరు గార్చుటచే నేతత్కారణ మరయ నాకు మఱియుం గుతూహల మగుచున్నది. అల్పకారణంబున నిట్టివారు శోకింపరు. క్షుద్రునిఘా౯తపాతంబున భూమి గదలునా? అని యిట్లు తద్విధం బరయదలంచి తదీయ శోకస్మరణమునకుఁ దానే కారణమని భయపడుచు లేచి యంజలిచేఁ బ్రస్రవణోదకము దెచ్చి మొగము గడిగికొమ్మని యమ్మగువ కందిచ్చెను.

అయ్యింతి సంతతముగాఁగారుచున్న యశ్రుధారచేఁ గలుషములగు నేత్రముల నాయుదకంబునఁ గడిగికొని వల్కలోపాంతముచే నద్దుకొనుచు నుష్ణముగా నిట్టూర్పులు నిగిడించుచు మెల్లగా నతని కిట్లనియె.

రాజపుత్రా! మందభాగ్యురాల నగు నా వృత్తాంతముతో నీ కేమిలాభమున్నది! అయినను వేడుకపడుచుంటివి. కావునఁ నాకణి౯ంపుము.

మహాశ్వేత కథ

దక్షునిప్రసిద్ధి నీవు వినియేయుందువు. అతనికి మనియు నరిష్ట యనియు నిరువురు పుత్రికలు జనించిరి, అందు మనికిఁ జిత్రరధుండను కుమారుం డుదయించెను.