పుట:Kashi-Majili-Kathalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4]

తారాపీడుని కథ

25

త్సవముపంచి పెట్టించెను.

క్రమంబునఁ బురుటిరాత్రులు గడిచినంత మహావైభవముతో యధావిధి జాతకర్మాది విధుల నిర్వర్తించి, స్వప్నంబునఁ జంద్ర మండలము సతీముఖంబునం బ్రవేశించుచున్నట్లు చూడఁబడుటం జేసి రాచపట్టికిఁ జంద్రాపీడుఁ డని పేరుపెట్టెను.

శుకనాసుఁడును, రాజానుమతి బ్రాహ్మణకులోచితములైన విధులన్నియుం దీర్చి కుమారునకు వైశంపాయను డని నామకరణము జేసెను.

కాలక్రమంబున నాఁబాలునకు శైశవ మతిక్రమించినంతఁ దారాపీడుఁడా నగరమున కనతిదూరములో మనోహర మణిశిలా లలితమగు విద్యామందిరము గట్టించి సకలవిద్యాపారంగతు లగు నుపాధ్యాయులఁ బెక్కండ్ర నియమించి వైశంపాయనునితోఁ గూడఁ జంద్రాపీడుం జదివింపుచుండెను.

రాజపుత్రుఁడు మంత్రిపుత్రునితోఁగూడ ననన్యగతమానసుండై యచిరకాలములో నాచార్యులవలన మణిదర్పణముల వలె నశ్రమముగా సమస్తవిద్యలుం గ్రహించెను.

సీ. మఱి పదవాక్యప్రమాణంబులను శబ్ద
               శాస్త్రమ్మున దర్ధశాస్త్రమందు
    నయశాస్త్రముల నభినయశాస్త్రములఁ జాప
               చక్ర కృపాణాది సాధనముల
    రజతురంగాది శిక్షలఁ జిత్రరత్న ప
               రీక్షల యంత్రతాంత్రికములందు
    గావ్యనాటకవరాఖ్యాయికాదుల సర్వ
               లిపి సర్వభాషా విలేఖనముల.

గీ. గ్రంథరచనల శిల్పకర్మల నశేష