పుట:Kashi-Majili-Kathalu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

కాదంబరి

గాంచితిని. వారాడుకొనుమాటలు వినుటచే వానిపేరు మాతంగుఁడని యెఱింగితిని.

ఆహా! వీని జీవితము మోహప్రాయము. చరితము సాధుజన గర్హితము. ఆహారము మద్యమాంసాదికము. పరిశ్రమయంతయు జీవ హింసయంద త్రాగుటయే యుత్సవము. చెరబట్టిన యుత్తమస్త్రీలే కళత్రములు. మృగములతో సహవాసము. పశురక్తంబున దేవతార్చనము. మాంసమున బలికర్మ ఇట్టి వీనికిఁ గరుణ యెట్లు కలుగును. శాంతిపేరైనం దెలియునా? క్షమకెంతదూరము. వీనికి వివేకమెన్నఁడైనఁ గలుగునేమో అని నే నాలోచించుచుండఁగనే యమ్మాతంగుఁ డరణ్యసంచార ప్రయాసమననయించుకొనటకై యా బూరుగు నీడ కరుదెంచి కోదండ మెక్కుడించి పరిజనోపనీతంబగు పల్ల వాసననంబునఁ గూరుచుండెను.

అప్పుడు శబరయువకుఁ డొకండు వడివడి నాసరోవరంబున కరిగి చేతులతో జలంబుపై నున్న మలినంబు విడఁద్రోయుచుఁ గమలినీపత్రపుటంబున నీరు వట్టి బిసతంతువులఁ గొన్నిటి కోసికొనివచ్చి యాయేలిక కర్పించెను. వాఁడాజలంబులం గ్రోలి చంద్రకిరణంబులం గ్రసియించు రాహువువలెఁ దామరతూడుల నమలి క్షుత్పిపాసల నపనయించుకొనియెను. వాఁడట్లు మాచెట్టునీడఁ గొంతసేపు విశ్రమించి పిమ్మటఁ పుళిందసేనాపరినృతుండై యెందేనింబోయెను.

వారిలో నొక్కవృద్దపుళిందుఁడు తినుటకు మాంసమబ్బమింజేసి యాఁకలిగొని వారితోఁబోవక యత్తరుమూలమున ముహూతన్‌ కాలము జాగుజేసి మా యాయువులఁ గ్రోలువాడువలె నెఱ్ఱనిగుడ్లుగల దృష్టులతో నావృక్షమెక్క నిశ్చయించి యా మూలచూడముగాఁ దల పైకెత్తి చూచెను.

ఆ చూపు వలననే శుకకులముల ప్రాణములు కుత్క్రాంత