పుట:Kashi-Majili-Kathalu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశిమజిలికథలు

బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షిత కవిగారిచే నీగ్రంథరాజము పండ్రెండు భాగములుగాఁ బండిత పామర హృద్యమగు శైలితో వచనమున రచియింపఁబడెను. ఈకథలు ఆంధ్రదేశమంతటను వ్యాపించి యుండుటనుబట్టి వీనిగుఱించి విస్తరించి వ్రాయఁబనిలేదు.

ఇందుఁ బతివ్రతల ప్రభావము, దుష్టస్త్రీల కుచ్చితచేష్టలు, తత్పురుష సాంగత్యమువలన గలుగు లాభములు, దుష్టసహవాసంబునం గలుగు ననర్ధములు, దేశాటనము పండితసంపర్కమున గలుగుజ్ఞానము, రాజనీతి, వ్యవహారవివేకము, వదాస్యలక్షణము, లోభిప్రవృత్తిలోనగు విశేషము లనేకములు వర్ణింపబడియున్నవి. మఱియుఁ గృష్ణదేవరాయ భోజరాజ శంకరగురు విక్రమార్క నారద ప్రహ్లాదాది మహాపురుషుల చరిత్రములు విచిత్రముగా వ్రాయబడియున్నవి. ప్రతి కథయందును నేదియో మంచి నీతి యుండకమానదు.

ఈకథలు విరక్తులకు వేదాంతవార్తికములు, జ్ఞానులకు నుపనిషత్తులు, కర్మిష్ఠిలకు స్మృతులు, వైదికులకు ధర్మశాస్త్రములు, యువకులకు గావ్యములునై యొప్పుననుటకు సందేహములేదు. ఏకథయైనను ప్రారంభించిన తరువాత దుదముట్టువరకు చదివినగాని విడువ బుద్ధిపుట్టకపోవుటయే యీకథలయందలి చమత్కారము. పెక్కేల యిక్కథలు సర్వజనాహ్లాదకరములై యున్నవని నొక్కి వక్కాణింపుచున్నాము. ఇందుకు లోకమే ప్రమాణము.

12 భాగములు అనుబంధము సహితము ఒకేసారి కొనువారికి వెలలో కొంతతగ్గించి పంపబడును. పోష్టుఖర్చులు కొనువారే వహించుకొనవలెను. వలయువారు యీదిగువ అడ్రసుకు వ్రాయవలెను.

మధిర శివరామకృష్ణశాస్త్రి

ఉల్లితోటవీధి, రాజమండ్రి.