పుట:Kashi-Majili-Kathalu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

కాదంబరి


ధరిత్రి యనాధయయ్యెఁ గదాయని యనేక ప్రకారంబుల విలపింపఁ దొడంగెను.

అతని గుఱ్ఱము దైన్యముగా సకిలింపుచు బలుమారతని మోము చూచుచు ఖురపుటాఖాతంబున భూతల రేణువు లెగర విచారంబు సూచింపుచుఁ జిందులు ద్రొక్కఁ దొడంగినది.

అని చెప్పువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుండు పై మజిలీజేరి తదనంతర వృత్తాంతమిట్లు చెప్పందొడంగెను.


శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

ముప్పదిమూఁడవ మజిలీ కథ

వత్సా! వినుము. అంతనక్కడఁ కాదంబరియుఁ బత్రలేఖచే చంద్రాపీడాగమన వృత్తాంతమునువిని చంద్రోదయమునసాగర వేలయుఁ బోలె నలరుచుఁ దల్లితండ్రుల కెద్దియో మిషజెప్పి వెండియు సుందరముగా నలంకరించుకొని పెక్కండ్రు పరిచారికలు సురభిమాల్యానులేపనాద్యుపకరణములు గైకొని తోడరాఁ కేయూరకుఁడు మార్గముజూపఁ బత్రలేఖ కైదండగొని నడుచుచు మదలేఖతో బోఁటీ! యీ పత్రలేఖ చెప్పినమాటలు వింటివా? అతని విషయమై నేను యశ్రద్ధ జేసితినఁట. నా యవస్థయంతయుం జూచియు హిమగృహంబున నైపుణ్యముఁగా బలికిన యతని వక్రభాషితములు నీకు జ్ఞాపకములేదా? నీవుసైత మప్పుడు నవ్వుచుఁ జూచి యతని మాటలకుఁ దగినట్లు ప్రత్యుత్తరముఁ జెప్పితివి. అట్టివాఁడిప్పుడు మాత్రము నన్ను విమర్శించునా, పయనము మాట దలపెట్టక పాపము నా నిమిత్త మీమత్తకాశిని యుత్తల మందు