పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చండిక కథ

87

అత్తలవరియు నతని వృత్తాంతము తన భటులవలనం దెలిసికొని తానుగూడ నతనితో నీవెవ్వడవు? ఈ పట్టణం బెట్లువచ్చితివి. ఈతోలు నీకెక్కడిది? అని అడిగెను కాని యేమియు బ్రయోజనము లేకపోయెను.

అప్పుడు కందర్పుడు సంజ్ఞలచే దన వృత్తాంతము కొంత జెప్పెను. అతని కేమియుం దెలిసినది గాదు. ఆ రాజపుత్రుని వింతపురుషునిగా దలంచి ప్రజలు మూగిచూడదొడంగిరి. వాండ్ర నతండును వింతగా జూచుచు దనజింక నన్యాయముగా రాజభటులు లాగికొనిరని సంజ్ఞాపూర్వకముగా జూడవచ్చిన వారికెల్ల జెప్పదొడంగెను.

అట్లు కొంతసేపు అతని విమర్శించి అతని నిజస్థితిని దెలిసికొనలేక చీటి లేకుండ బట్టణములోనికి వచ్చినందులకును దోలు దెచ్చినందుకును నపరాధిగానెంచి తమ అధికారప్రకారము కందర్పుని బందీగృహములో నుంచిరి.

ఆ చర్మకురంగమును చౌర్యవస్తువుల నిడు మందసములోనుంచిరి. అప్పుడు కందర్పుడు డెందంబున నిట్లు తలంచెను.

ఆహా! విధిపరిపాక మనివార్యమైనదికదా! నాకు విదేశదర్శనలాభఫలం బిది కాబోలు. నాకే బదియారు భాషలు వచ్చును. వానినన్నిటిని వినియోగపరచితిని. ఏమియు బ్రయోజనము లేకపోయెను సర్వదేశపూజ్యమైన సంస్కృతము సైత మీదేశమందు లేనట్లు తలంచెద. నీదేశాచారము లెట్టివో తెలియవు. నావలన నేమి అపరాధము గణించిరో యెఱుకపడదు. వీరిభాష యేమాత్రమున నాకు విశదము కాకున్నది. నా ప్రాణప్రదమైన తోలుజింకను పుచ్చుకొనిరి. ఇంక నే నేమి చేయుదు నెవ్వరితో చెప్పుకొందును ఈలోపల నీజింక మర్మము వారికి దెలిసినచో వారే సారింతురు. తిరుగా నాకీజన్మమున స్వదేశమును స్వజనమును జూచు భాగ్యము లేదుకాబోలు అన్నన్నా! యింటియొద్ద హాయిగా సుఖింపకుండ నాకిట్టి బుద్దియేమిటికి బుట్టవలయును. అని కొంతసేపు విచారించి అంతలో మరల దైర్యముతెచ్చుకొని యోహో, ప్రమాదమువలన నదైర్యపడితిని. నేనువచ్చినది విదేశాచారములు చూచుటకుగదాఁ ఇదియొక వింతయాచారము, తెలిసినది. పదిదినములకు వీరిభాష నేర్చికొని పై అధికారులతో జెప్పుకొనియెదను. ఇందుమాత్రము న్యాయమెఱింగిన వారుండరా యేమి? ఇచ్చటి ప్రజలంజూడ నాగరికత గలవారువలెనే తోచుచున్నారు. ఇచ్చట హిమము విస్తారముగనుక వీరలాపాదమస్తకపర్యంతము గప్పునటు లంగీలు దొడగియుండిరి. వీరియాహారము లెట్టివో తెలియవని అనేకప్రకారముల దలంచుచు నాచెరసాలలో నుండి అంతకుముందున్నవాండ్రతో మాట్లాడుచు వారి భాషను నేర్చుకొనవలయునను తలంపుతో నుండెను.

ఇంతలో నొక అధికారి అశ్వశకట మెక్కి, యాకొట్టమునకు వచ్చి అచ్చట బండి దిగి తలవరితో గలిసికొని అందు బద్ధులైయున్నవారి బరీక్షించుచు గందర్పునిం జూచి యీచోరు డెవ్వడని అడిగిన నతం డతని అపరాధప్రకార మెఱిగించె దాన .