పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుభధ్రకథ

85

ఓరీ! నేను వేరొక పనిమీద నీతో జెప్పకుండ అఱిగితిని. నీవు నన్ను వెదకితివి కాబోలు! నీవెంత దనుకనుంటివని అడిగిన వాడు నవ్వుచు బాబూ? నాయొద్ద గపటముగా మాటాడెదవేల? నాకేమైన నియ్యవలసివచ్చుననియా యేమి? మీగుజుగుజ లన్నియు నేను వినుచునేయుంటిని. నేనెంత ముసలివాడనై నను నీలాటి చర్యల గనిపెట్టగలను.

ఎట్లయిన లెస్సయే కాని మణివర్మ చండశాసనుండు సుమీ! కనిపెట్టి తిఱుగ వలయునని పలికిన విని నవ్వుచు అతండు వానికి మఱియొక పారితోషికమిచ్చి యోరీ! మఱియేమియును లేదు. మీ సుభద్ర నాయొద్ద వ్రాతపని నేర్చుకొనుచున్నది నిన్న నీతోలు మఱిచిపోయి తెచ్చితిని, రహస్యముగా దీసికొనిపోయి సుభద్ర కియ్యవలయునని చెప్పిన వాడును సంతోషముతో గైకొని మీరు చెప్పినట్లు చేయువాడనని పలుకుచు మణివర్మ యింటిలోని బోయెను.

తరువాత గందర్పుం డింటికింబోయి ఉపాధ్యాయుని రప్పించి యాజింక విశేషములన్నియు జెప్పి యార్యా? యీ కార్యము మీ అనుగ్రహంబున లభించినది. ముందుగా నేదేశమునకు బోవలయు? నేనఱిగిన వెనుక నాకొరకు మా తలిదండ్రులు చింతింతురు. మాసము లోపున వత్తును. వారినోదార్చుచుండుడని చెప్పిన నాయనయు అతని సంకల్పసిద్దికి వెరగందుచు నిట్లనెను రాజపుత్రా! భరతఖండమంతయు సులభముగా జూడదగినదే. హిమాచలమున కవ్వల నేమియున్నదో తెలియదు. అచ్చటికి భూగమనంబున బోవుట అశక్యము. ముందుగా అచ్చటికి బోయిరమ్ము రేపే శుభముహూర్తమని చెప్పిన సంతసించుచు నాచార్యుని కెన్నియో చెప్పి యింటి కనిపెను.

అంత గందర్పుండు మఱునా డరుణోదయంబున లేచి ఇష్టదేవతానమస్కారములు గావించి యాహారపదార్ధములు కొన్ని మూటగట్టికొని యాజింకను బూరించి యెక్కి జయపరమేశ్వరా యని మర ద్రిప్పినంత అత్యంతవేగముగా నెగిరి గగనమున నిలిచినది. అప్పు డుత్తరముఖముగాఁ దిప్పి రెండు చెవులు నొక్కి శిరమునందలి చీలత్రిప్పగా గరుత్మంతునికన్న వేగముగా నడువజొచ్చినది దానిమహిమ యెట్టిదో కాని యొడలు త్రిప్పుటకొని కుదుపుకాని యించుకయుం దోపక వేగ మెక్కువైన కొలది నతని కుల్లాస మెక్కుడగుచుండెను. అతండు దానిని భూమి కనతిదూరములో నడిపించుచు దేశవిశేషములన్నియు బరికించుచు రెండు యామములలో హిమవంతమును జేరెను.

శీతసంఘాతపాతంబున జేసి దాని హిమగిరిగా నెరింగి ఆతండు తదీయశిఖరంబున జింకనాపి యొక్కింతసేపు విశ్రమించెను. మధ్యాహ్నసమయముగాన మంచుబాధ అతని కంతగా దోచినది కాదు. తదీయవిశేషము లన్నియు దిరుగా వచ్చునప్పుడు చూడ నిశ్చయించి యతండందు బెద్దతడపు నిలువక తాను దెచ్చిన యాహారమును భుజియించి వెంటనే యాజింక నెక్కి వెండియు నుత్తరాభిముఖుండై అరిగెను.

హిమవత్పర్వతోత్తరభాగంబున బెక్కుదూరమువరకు బర్వతములు, నడ