పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

59

ఈకొమ్మ యెచ్చటికి బోగలదు? దుర్మార్గుడైన గుణవర్మ యెక్కడ నున్నాడని అడిగెను.

అప్పుడు జయభద్ రుడతని మఱియొకగదిలోనికి దీసికొనిపోయి అందొక గవాక్షము దాపున గూర్చుండబెట్టి మిత్రమా ! నీ వీవిడెము వైచుకొనుచు నీపీఠముపైన గూర్చుండుము. ఆచిన్నది యిప్పుడు పూబంతులు గట్టుచున్నదిగదా? యిప్పుడే ఈదారిని నీచాయ గుణవర్మ వచ్చి యాలోపలకు బోవును. నీ వీకిటికిలో నుండి చూచుచుండుము. లోపలకు బోయిన తరువాత తలుపులు బిగించుకొని యిరువురు మనోహరముగా వీణాగానము పాడుకొనుచు యథేష్టకామంబుల దృప్తి నొందుదురు. నీ విచ్చటనే కూర్చుండిన వారు పాడుకొను సంగీతము కూడ వినిపించును. మాట్లాడక కూర్చుండుము. నేను వెలపల గాచి యుండెదను. నేనువచ్చి పిలుచుదనుక నీ వీవలకు రావలదు సుమీ అని చెప్పి యాగదిలోనుండి తాను వెలుపలకువచ్చి పైన దలుపు గొణ్ణెము పెట్టి గుణవర్మ రాక వేచి సోపానముల . మొదట గూర్చుండెను.

ఇంతలో గుణవర్మయు జక్కగా అలంకరించుకొని అచ్చటికి వచ్చి జయభద్రుజాడ అరయుచుండ అతం డాతని చేయి పట్టుకొని మాటాడకుండముందుగా వేఱొకదారిని నామేడమీదకు దీసికొనిబోయి ధనవర్మయున్న గదివెనుకటి భాగమున నిలువబెట్టి సన్నని గవాక్షరంధ్రమునుండి ముందు ధనవర్మం జూపెను.

అప్పుడు గుణవర్మ ధనవర్మంజూచి తలయూచుచు నీమిత్రద్రోహుడు నాతో జెప్పక యెట్టిపని చేయుచున్నాడు. కానిమ్ము వీని సంగతి రేపు చూచెద. నార్యా! హైమవతి యెచ్చట నున్నదని అడిగెను.

అప్పుడతండు గుణవర్మను ధనవర్మ చూచుచున్న కిటికీదాపున నుండి రమ్మని చెప్పి తాను వేరొకదారిం దిరిగివచ్చి అతనిం గలిసికొనియెను.

తనప్రాంతమునుండి పోవుచున్న గుణవర్మను చూచి ధనవర్మ గుఱుతుపట్టి యిప్పుడే చంపవలయునని అహంకారము పుట్టినది కాని బోనులోబెట్టిన వ్యాఘ్రమువలె దలుపులు వైచిన నాగదిలో నుండుటచే నేమి సేయుటకు వీలు చిక్కినదికాదు.

తరువాత జయభద్రుడు గుణవర్మను గవాక్షము దాపునకు దీసికొనిబోయి లోపలనున్న హైమవతి విలాసము లన్నియుం జూపెను.

అప్పుడు గుణవర్మకును ధనవర్మ వెఱ్ఱియూహ లన్నియుం బుట్టినవి. జయభద్రు డెట్టకేలకు అతని నాగవాక్షము దగ్గిర నుండి తప్పించి అవతలప్రక్క నున్న వేరొకగదిలో గూర్చుండబెట్టి మిత్రమా నీ విందు గూర్పుండుము. ఆగదిలో నున్న నీచాయ లోపలకు వచ్చి హైమవతితో గూడి వేడుకగా సంగీతము పాడును. అదియు నీకు వినిపించును. పిమ్మట నేను వచ్చెదనని ధనవర్మకు జెప్పినట్లు చెప్పి అతని నందు గూర్చుండబెట్టి పైదలుపులువైచి తాను హైమవతియున్న గదిలోనికి బోయి యాగది తలుపులన్నియు మూసి వారిరువురకు వినిపించులాగున నాచిన్నదానితో నెద్దియో గుసగుసలాడుచు సంగీతము పాడవలయునని కనుసన్న జేసెను.