పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కాశీమజిలీకథలు - మూడవభాగము

లాగికొనిన మఱియు సంతసింతురు. అయన బిక్షకుబోయి బ్రాహ్మణులను యెన్ని చిక్కులు పెట్టెనో తత్ఫలం బనుభవింపవలదా ?

రామ - నీవు చెప్పినట్లు ఈదినములలో బరీక్షింపక వస్తువులు కొనరాదు సుమీ ?

సుబ్బి - మరియు వీరపాలుడును శూరపాలుడును ప్రజలను వేపుచున్నారు మన చంద్రపాలుడైనచో నింత కఠినముగా చేయడు.

రామ - యేమైనను గాలానుగుణ్యముగా నడచుచుండ పలయును. ఈదినములలో నేజోలికి బోవనివాడే యుత్తముడు.

సుబ్బి - సత్యమే ప్రొద్దుపోయినది నిద్రపోవుటకు బోదము లెమ్మనిపలుకుచు నిష్క్రమించుచున్నారు.

వారి మాటలన్నియు విని హైమవతి మిక్కలి పరితాపము జెందుచు ఆర్యా! నాకతంబున నాతలిదండ్రులు చోరులవలె బద్దులైరఁట యెంత కష్టము, నేను వేగముపోయి వారికిఁ గనంబడితినేని వారి చెర విడఁగలదు. యెట్లయినను వారీ యాపద యుడిగింప మీరు తగిన ప్రయత్నం చేయవలయును. పోదము లెండని యూరక తొందరపెట్టిన నాజయభద్రుఁడు నవ్వుచు నిట్లనియె.

పువ్వుబోడీ! నీవచ్చటికిబోయి యేమిచేసెదవు. ధనవర్మ గుణవర్మలలో నెవ్వరిని వరింతువు? యెవరిపక్ష మవలంబింతువు. ముందుగా మీ తలిదండ్రులకుఁ గనంబడిన నేమి ప్రయోజనము. నీకతంబున వారిరువురకుఁ గలహము రాఁగలదు. నీపక్షము చెప్పితినేని నేనుగూడ నావైపుననుండి జయము గలిగించెదనని పలికిన కలికి కనుదమ్ముల జలమ్ము గ్రమ్మదలవాల్చుకొని వెక్కి వెక్కి, యేడువ దొడంగినది.

అప్పుడతండు అయ్యో! తొయ్యలీ! తొయ్యలీ ! నీవింతబేలవని యెఱుంగనే ? నామాటలలో నేమి శంకించి యిట్లు శోకించుచున్నదానవు. నేను నీవు చెప్పినట్లు నడుచువాడ నూఱడిల్లుము. నాబుద్దిబలముచేత నీ తల్లిదండ్రుల చెఱవిడిపించెదనని పలికి యాపడతి మనస్తాపము వాయఁజేసెను. అంత నానిశావసానమున లేచి వారు మరునాటి రాత్రికి అమరావతిఁజేరి అందొక పేద బ్రాహ్మణునియింట బసఁజేసి యచ్చటి విశేషములన్నియు నాగృహస్తువలనం దెలిసికొనిరి.

హైమవతియు జయభద్రుడును దినమున కొకరీతి వేషములు వైచుకొనుచుండిరి. కావున వారి నెవ్వరును గురుతుపట్టలేకపోయిరి.

అంతకు బూర్వము హైమవతియొక్క రత్నభూషణములు గొనిన స్వాములవారు రత్నవర్తకుడు మొదలగు వారందఱు చోతులవలె బద్ధులై అప్పురంబున జెరసాల పెట్టబడి అప్పుడప్పుడు వీథుల వెంబడి త్రిప్పబడుటచే వారినందఱం జూచి జయభద్రుడు జాలిపడుచుండెను.

జయభద్రు డాపట్టణములో మారువేషమున గౌరవవేషముతో గ్రుమ్మరుచు