హైమవతికథ
55
రామ - ఆసంగతి కొంచెము వింటిని.
సుబ్బి — పాపము శూరపాల వీరపాలు లిరువురు నేకమై హైమవతి తల్లిదండ్రుల చెరసాలలో బెట్టి యాచిన్నదానిజాడ నరయుటకై నానాదేశములకు దూతలం బుచ్చిరట.
రామ - భార్యభర్తలమాట యొకటిగానిచో నీరీతినే జరుగును తరువాత.
సుబ్బి - ఆమెను బాగుగా గురుతెఱింగిన వారెవ్వరో వీరిశెట్టి దగ్గర నామె కర్ణభూషణ మొకటి పట్టుకొనిరట.
రామ — వీరిశెట్టి కామె వస్తువెట్లు దొరికినది.
సుబ్బి -- వినుము వీరిశెట్టి దొంగవస్తువులు సులభక్రయమునకు బుచ్చుకొను నను వాడుక వినియుంటివా ?
రాము - అవును ఎరుంగుదును. అతనికట్టివాడుక యున్నది.
సుబ్బి - ఎవ్వడో యొకడావస్తువు నమ్మజూపుటయు వీరిశెట్టి స్వయంపాకం మాత్రమిచ్చి యదిపుచ్చుకొని అమరావతికింబోయి తిరుగ విక్రయింప నంగటిలో బెట్టినంత రాజభటులు గురుతుపట్టి అతనిం బట్టుకొని చెఱసాలలో బెట్టిరట.
రామ - అయ్యో! పాపమెంతపని జరిగినది. తరువాత విడిచిపెట్టిరా?
సుబ్బి — ఎట్లు విడచిపెట్టుదురు. ఆతనిమాట లేమియును విశ్వసింపక వస్తువిచ్చిన వానింజూపువఱకు విడువదగదని తీర్పు చేసిరట. దానంజేసి ఇప్పటికిని ఆతండు కారాగృహములోనే యుండెను.
రామ - సుబ్బిశెట్టి అటువంటి చిత్రము నేనును మఱియొకటి వింటినిసుమీ?
సుబ్బి - అదియెట్లు?
రామ - ఈప్రాంతమందొక సన్యాసి యుండెనట ఆయన పేరెద్దియో చెప్పిరి గాని నాకుజ్ఞాపకములేదు. ఆయన నిత్యము వరహా యిచ్చువాని యింటకాని భుజించువాడు కాడట. వరహా యియ్యనిచో నాపోశనము నేలజిమ్మివేచి పోవువాడట. ఈరీతి బెక్కుధనము సంపాదించెను. పాపమా స్వాములవారు మొన్న నీనడుమ నెచ్చటకో భిక్షకుపోయి వారొక రత్నకంకణము దక్షిణగా నిచ్చిన సంతోషముతో బుచ్చుకొనియెనట.
సుబ్బి - ఓహో! ఆయనా! అంతకఠినాత్ము డెచ్చటను లేడు సాదారణముగా నాస్వామిని భిక్షకెవ్వరును బిలువరు. పదేసి దినములుపవాసముగానే యుండును. తరువాత నేమి జరిగినది ?
రామ - ఆకడియమును వీరిశెట్టివలెనే స్వాములవారును అమరావతికి అమ్ముటకు దీసుకొనిపోయిరి. అచ్చట రాజభటులు గురుతుపట్టి యతీశ్వరుడని సంశయింపక యాయననుగూడ గారాగృహములో బెట్టిరట. ఆప్రభువుల శాసనము లెంత యుగ్రముగా నున్నవియో చూచితివా?
సుబ్బి - ఆ యతికి మాత్రమట్టు కావలసిందే ! ఆయన పూర్వధనముగూడ