పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పయ్య - సంభావనలాగే యున్నది. తుద కన్న మైనను దొరకినదిగాదు.

రామా - ఎందువలన?

అప్పయ్య - ఆ చిత్రము వినిన మిగుల హాస్యాస్పదముగా నుండును. ఇంతకుము న్నెన్నడును వినియుండలేదు.

రామా - ఎట్లెట్లూ? వడిగాఁ జెప్పుడు.

అప్పయ్య - చెప్పెద వినుడు. అమరావతీ చక్రవర్తి మంత్రపాలుఁడను రాజు హైమవతియను కూతుఁరు వీరపాలనృపాలుని కుమారుడు గుణవర్మకు గన్యాదానము చేయ నిశ్చయించి నానాదేశములనుండి పండితులను, బంధువులను, మిత్రులను బిలిపించి మిగుల వైభవముతో సుముహూర్తమునఁ గన్యాదానము గావించెను.

రామా - ఉచితముగానే యున్నది తరువాత తరువాత.

అప్పయ్య - ఆశీర్వచనమైన తరువాత కన్యకను లోపలకు దీసికొనిపోయిరి బ్రాహ్మణునకు బహుమతు లియ్యఁదలంచుకొనునంతలో నింటిలో అల్లరి పుట్టినది.

రామా - మంచిసమయములోనే అడ్డువచ్చినదే. అదియేమి?

అప్పయ్య - కన్యక అత్తగారికికి నమస్కరింపబోవునంత, యామె నిదానించి చూచి, తమకుఁ జిత్రపటంబున జూపిన పిల్ల యిదికా దనియు మాయఁజేసిరనియుఁ జెప్పి తగవుపెట్టినది. దానిమూలమున పెద్ద కలహము పెఱిగినది తొలుత వాక్ప్రహరణములచే పెండ్లివా రొండొరులం గొట్టుకొనిరి.

రామా - అట్లుచేయుటకుఁ గారణమేమి?

అప్పయ్య - ఆ అలజడిలో నిజము బయలుపడినది; వినుము రాజుగారిభార్య గుణవర్మ దరిద్రుడను కారణమున గూఁతు నిచ్చుటకు సమ్మతిలేక ధనవర్మను రహస్యముగా రప్పించి గంపలో గన్యనిడి అచ్చటికి బంపినదఁట. మగని నిర్భంధముమీద మరియొక కన్యక అలంకరించి అప్పుడు పీటలపై గూర్చుండబెట్టి కన్యాదానము చేసినఁదట

రామా - స్త్రీలెంతకైనను సాహసము కలవారగుదురు. తరువాత?

అప్పయ్య - చివర కాకన్యకను ధనవర్మయుఁ బెండ్లియాడలేదు. నడుమ యేమైపోయినదో తెలియకున్నది.

రామా - బాగు! బాగూ! యిట్టి చిత్రమెందును వినియుండలేదు పిమ్మట.

అప్పయ్య - అప్పుడు మంత్రపాలుడు భార్యను నిర్బంధించి అడిగి నిజము తెలిసికొని యాగ్రామమంతయు వెదకించెను, కాని అచ్చట నాచిన్నదాని జాడ గనంబడినదికాదు. దానంజేసి శూరపాల వీరపాలురు మంత్రపాలునియందు ద్వేషించిరి.

రామా - మంత్రపాలునికి గొప్పచిక్కే తటస్థించినదే. తరువాత ?

అప్పయ్య - మంత్రపాలుం డెఱింగియే యిరువురు మోసము చేసినాడనియు బిల్ల నెచ్చటనో దాచినవాడనియు నిశ్చయించి యిరువురు నేకమై అతని నిర్భంధించుచుదర్జించుచున్నారు. మంత్రపాలుడు దీనుడై వారిని వేడుకొనుచు నాకన్యక