పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కాశీమజిలీకథలు - మూడవభాగము

ఒండొరుల అభిప్రాయములు తెలిసికొనియును నిద్దరును తమకు దామయై వాచకముగా జెప్పరప్పుడు కాని వెల్లడి చేయరాదని తలంచుకొని యుండిరి. దానం చేసి వారు చేయుకృత్యములు లన్నియు నన్యాపదేశములుగా నుండెను.

అప్పడతి అతనితొడమీద శిరంబిడి పరుండి వారచూపులచే నడుమ నడుమ నతని ముఖవిలాస మవలోకింపుచుండెను.

జయభద్రుండును వెరపుడుపువాడువలె హృదయంబున జేయివైచి నిమురుచుండె. అప్పు డయ్యిరవురకు నూతనసంతోషముతో నారాత్రి దృటిగా వెళ్ళినది.

ఉదయంబున లేచి చూచువరకు జీనుగట్టిన గుర్రమొకటి యా ప్రాంత మందు మేయుచుండెను.

దానింజూచి జయభద్రుఁ డదిగో! అశ్వమొకటి కనంబడుచున్నయది. ఈ ప్రాంతమున గ్రామమెద్దియేని యుండవచ్చును. వడిఁగాబోదము ముదితా! లెమ్మని పలుకఁగా నయ్యువతి యిట్లనియె.

ఆర్యా! ఈ యశ్వము మొన్నను వచ్చిన దొంగలది. దీనిపైన నేను వచ్చితి. ఈ గుఱ్ఱపుదొంగ సమసెం గావున నీయడవిలో నిది తిరుగుచున్నది.

ఈ యడవిలో నాదొంగలు గూడఁ తిరుగుచుందురేమో, మనలను జూచినచో నిర్భంధింపకమానరు. మఱియొకదారిని వేగముగాబోదమనుటయు నతండా గుఱ్ఱముదాపునకు బోగా నదియట్లే నిలువంబడియుండెను.

మచ్చిక గలదు. కావున దాని కళ్ళెము పట్టుకొని వీపుపయిం దట్టుచు నారాపట్టి కిట్లనియె.

బోటీ! నీవీ ఘోటకముపై నెక్కుము. నేను నీవెనుక నెక్కెదను; నీ కేమియు భయములేదు. మెల్లగా దోలెదను. ఈ యడవిలో నీవు నడువలేవనియే దైవము నీకీ యాధారమును జూపెను. రమ్మనగా నా కొమ్మ యిట్లనియె.

ఆర్యా! నాకును గుఱ్ఱమెక్కు పాటవముగలదు. వడిగాఁదోలినను వెఱవనని పలుకుచుఁ గళ్ళెము గైకొని లఘుగలి నాతురగ మెక్కినది. జయభద్రుడును వెనుక భాగమెక్కి యక్కలికి నెడమచేతితో కౌగలించుకొని కుడిచేతితో గళ్ళెము పట్టుకొని గుఱ్ఱమును మెల్లగా నడిపింపఁ దొడంగిన నక్కు రంగనయన నవ్వుచు నోహో! నాకేమియు వెఱుపులేదు. త్వరగా దోలుఁడని పలికి తానే గుఱ్ఱమును కాళ్ళతోఁ గొట్టెను.

అప్పు డత్తురంగము లేఁడివలె నెగురుచు వాయువేగముగా బోదొడంగినది. దానికి నడవిలో నడచు పాటవము గలిగియున్నది. కావున పొదలును రాళ్ళును లెక్క సేయకయే యొక్కరీతిగా సాయంకాలము వరకుఁ బోయినంత నొకపల్లె గనంబడినది.

ఇరువు రొక్కగుర్రముమీద నెక్కిన జక్కగానుండదని యక్కడ నాయశ్వ