పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాలతి కథ

295

పుత్రికవంటిదాననని కన్నీరువిడచుచు తనవృత్తాంతమంతయుం జెప్పి యతనిపాదంబులం బడినది.

దీనులంగావ కంకణము గట్టుకొనిన యప్పుణ్యాత్ముడు హృదయంబునఁ గనికరంబు జనింప తరుణీ! నీవు వెరవకుము. ఇది దైవకృతము నాజీవితము ధారవోసి యయిన నీకు శుభము గూర్చెదను. వీరు వెర్రివాండ్రుకారు. కారణముచే నిట్లు తిరుగుచున్న వారలని తత్కాలోచితమయిన మాటలచే నాబోటికి ధైర్యము గలుగ జేసెను. గూఢముగా వారిచర్యలు బరీక్షించుచు కొన్నిదినములు దిరిగెను.

ఒకనాడు విక్రమార్కుండును భట్టియు బ్రచ్ఛన్నముగా జయంతమను పట్టణములో రచ్చబల్ల పై కూర్చుండి వినుచుండఁ గొందఱు విటపురుషు లిట్లు సంభాషించుకొనిరి.

శృంగార శేఖరుడు - వీరభద్రా? వేళయగుచున్నది. మనమనుకొనిన ప్రకారము నాలుగువీథుల మొగలయందును మనమిత్రులు నిలచియుండిరా? మయూరుఁ డెందున్నవాడు.

వీరభద్రుడు - మయూరుడు తూరుపువీథిని గాచియుండెను. వివక్షణుడు దక్షిణవీథిని, రాజశేఖరుడు పడమరవీథిని వీథ్యంతముల వాని సోదరులును నిలిచి యుండిరి. నీ విందుంటివో లేదో యని చూడవచ్చితిని. నేనుత్తరవీథికి పోవుచున్నాడ నేనుగతోఁ దిరుగుచుండుఁడని జంబుకాదులకు నియమించితిని.

శృంగా - ఆమాతంగ మెవ్వరిని వరించినను మనమందర మీ రాజ్యము సమముగా పంచుకొందమని ప్రమాణపత్రికలు వ్రాసికొంటిమిగదా? దానిలో నిన్నను మయూరుడు వ్రాలు చేయలేదు. తరవాత చేయించితివా? ఆనక తగవు పెట్టగలడు .

వీర - ఏనంత వెర్రి వాడననుకొంటివాయేమి? అన్ని కొఱతలు దీర్చితిని. దైవానుగ్రహముమాత్ర ముండవలయును.

శృంగా - మిత్రమా! మనకుఁ దప్పక రాజ్యము రాగలదు. రెండు మూడు దినములనుండి నేను కళత్రముగా స్వీకరించిన నాగరత్నమునకు మంచిస్వప్నములు వచ్చుచున్నవట.

వీర - దానిస్వప్నములు మనకేమి లాభము జేయగలవు.

శృంగా - అయ్యో! నీవింత యెఱుంగవేమి ? మనకు రాజ్యము వచ్చిన అనుభవమెవ్వరిది? వాండ్ర మేనులన్నియు బంగారుమయములు కావా? మనరాజునకు సంతతి లేకపోవుటయు నకాలమృత్యు వతని కబళించుటయు భూపాలదేవమహారాజు గారి మంత్రి దేశయాత్ర వచ్చుటయు నిటవచ్చి యిట్టి యేర్పాటు చేయుటయు నీ రాజ్యము మనకు రానయియుండుటయు నిది యంతయు మనముంచిన వారకాంతల యదృష్టము కాక యెవ్వరిది?

వీర - పట్టపువేదండము తొండమునకు బూవుదండయు జలయుక్త సువర్ణ