మాలతి కథ
285
యుం గనబడలేదు. ఉపహారము లేమియు సమకూరినట్లు తెలియదు. నీవు విమర్శించి యతని పరిచారకులెందై ననుండిరేమో తీసికొనిరమ్ము.
పలల ప్రియుడు--చిత్తము చిత్తము అని నలుమూలలు తిరుగుచు రౌద్రాకారముతో ఏమి యీభేతాళుని గర్వము పిశాచసార్వభౌముండువచ్చియుండ నెందు బోయెను. తనకింతన్న నావశ్యకమైన పని ఏమివచ్చినది. ఏడాది కొకసారి వచ్చెడు ప్రభువును సత్కరింపవలదా మంచివాడైన యెకిమీనియానతి ప్రణిధులు మన్నింపరను సామెత నిక్కువవయ్యేనే. కనంబడనీ యేమి చేయించెదనో, భేతాళదూత లెందున్నవారిని పెద్దయెలుంగున బిలుచుచుండ నొకదండనుండి యిరువురువన్చి దేవా యిదిగో మేమిప్పుడే వచ్చి యున్నామని చెప్పిరి.
పలల ప్రియుడు – మీ రెవ్వరు.
తామ్రకేశుడు - మేము భేతాళుని మంత్రులము. నా పేరు తామ్రకేశుడు వీని పేరు తుందిలోదరుండును.
పలలప్రియుడు - ఓహో! మీస్వామి యెందువోయెను. వానికింత కావరమేల వచ్చినది. భూతసార్వభౌముని యాజ్ఞప్రభావముల నెఱుంగడాయేమి.
తుదింలోదరుడు - మీస్వామి యట్టివాడు కాడు. కారణమును విని తరువాత నిందింపుడు.
పలల ప్రియుడు - అది యెద్దియో ప్రభువుగారి యెదుటనే చెప్పుదురుగాని రండని వారింగెంటుకొనిపోయి దేవా! ఇదిగో యిప్పటికి భేతాళుని దూతలు కన్నులు దెరచివచ్చిరి. ఎద్దియో చెప్పుచున్నారు వినుడు.
భూతరాజు - మీరు భేతాళుని మంత్రులా? ఆంతడెందువోయెను మారాక విని యున్నవాడా?
తామ్రకేశుడు - దేవా! వినుండు. భేతాళుండు పరాధీనుండై స్వామికార్య మెట్లు చక్కబెట్టగలడు అతండు విక్రమార్కమహారాజుగారివలన దపంబున స్వాధీనపెట్టుకొనబడినవాడని దేవర యెరింగియే యుందురు.
భూతరాజు - అవును ఆ మాట వెనుక మాతో నొకప్పు డతండు విజ్ఞాపన చేసికొనియెను. తరువాత?
తామ్రకేశుడు — అమ్మహారాజు తలంచినప్పు డతం డరుగకతీరదు.
భూతరాజు - అగు నామాటయు మేమువినియుంటిమి. పిమ్మట.
తామ్రకేశుడు - ఇప్పుడు నృపసార్వభౌముండైన భూపాలదేవచక్రవర్తిగారి మంత్రియైన విజయవర్ధనుడు తమక్రింద సామంతరాజులపాలనాప్రకారము లెట్లున్నవో విమర్శించుటకయి దేశయాత్ర చేయుచు నీనడుమ నజ్జయినికి వచ్చుచున్నామని విక్రమార్కునికి యుత్తరము వ్రాసిరట.
భూతరాజు -- చక్రవర్తులకు సామంతరాజుల పాలనా ప్రవృత్తుల దెలిసికొనుట యావశ్యకమయియున్నది. తరువాత?