256
కాశీమజిలీకథలు - మూడవభాగము
ఈరీతి వారిరువురు తమరహస్యముల వారెఱుగరని బొంకిన విని విజయుడును చంద్రుడును విస్మయము జెందుచు నప్పటికి దగినరీతిగా మాటలాడిరి. పిమ్మట విజయుడు తమ్ములారా! మనము వచ్చి పెద్దకాలమైనది. మన తలిదండ్రులు మన నిమిత్తము చింతించుచుందురు. కావున నింటికి బోవుదము రండని పలికినం జంద్రుడు సమ్మతించెను. తక్కిన వారిరువురు మఱికొన్ని దినములు దేశాటనము చేయవలయునని చెప్పిరి.
విజయుడు అన్యాపదేశముగా వాండ్రను మఱియొకనాడు పెద్దగా మందలించిన గ్రహించి వాండ్రిరువురును రహస్యముగా మాటాడుకొని వారింజంప ప్రయత్నముచేయుచు నాకపటముఁ దెలియనీయక యిష్టులువోలె మెలంగఁ దొడంగిరి.
విజయుడు తనభార్య వృత్తాంతముఁ దెలిసికొనవలయునని బలవర్దనుడు పాలించెడు కరిపురము మార్గము ననుసరించి పయనములు సాగింపఁ దొడంగెను.
ఒకనాడొక యరణ్యములాఁ బోవుచు నొక యగాధకూపసమీపమున వారు భోజనార్థము వసియించియున్న సమయంబువ రుచిర నీటికై నూతియొద్దకుఁబోయి నూతిలోని జలము తొంగిచూచి యాశ్చర్యముఖముతోఁ బరుగిడివచ్చి ఓహో! యీ నూతిలో వింతలం జూచితిని ఇరువురుకాంతలు మునుగుచుఁ దేలుచున్నారు. వారు నాగకాంతలని తలంచెదను లేక తెరువరు లేవ్వరేని బ్రమాదంబున దానిలోఁ బడిరేమో తెలియదని పలికిన విని వారు నలువురు తటాలునలేచి యాకూపము నొద్దకు బోయి యాయువతు లెక్క డెక్కడని రుచిర నడిగిరి. రుచిరయు నిదిగో యీమూల తేలిరి. ఈమూల మునిగిరి విమర్శించి చూడుడు. అదిగో బుడగలు వచ్చుచున్నవని చెప్పుచుండ విజయుండును జంద్రుడును వంగివంగి చూడదొడంగిరి.
అట్టిసమయమున భానుడును రాముడును మెల్ల గా వెనుకకు వచ్చి వారికాళ్ళు పట్టుకొని చెరియొకరిని నానూతిలో బడవయిచిరి. కటకటా!
చ. తిమిరనివారణక్రియకు దీపము వారిధి విస్తరింపఁబో
తముచలిబాప వహ్ని రవితాపభరంబడగింప నాతప
త్రము కలుషంబులం జెఱుప ధర్మము బాల్బడియుండుఁగాని య
క్కమలజుఁడున్సుఖోద్యముఁడుగాడు దురాత్మునిఁజక్కఁజేయగాన్.
అని భర్తృహరి చెప్పియున్నాడు. ఎట్టికార్యమునకైన సాధనమున్నదికాని దుర్జనునిఁ జక్కఁజేయుటకు సాధనము లేదుగదా ?
అట్లు వారిని నూతిలో బడవేసి వారిరువురు రుచిరతో కూడికొని యెందేని పోయిరి. ఆకపటమంతకుఁ బూర్వము వారు బోధించుకొనినదే.
విజయుడునుఁ జంద్రుడును నూతిలోబడి తాళదఘ్నమగును జలంబులమునింగి యడుగంటి వెంటనే పైకిఁదేలిరి. వారికి నీదుపాటవము గలిగియుండుటచేఁ దిరుగా మునుంగక యీదుచు ప్రమాదముచే బడినవారికి నూతగానుండుటకై నీటిమట్టముగా