24
కాశీమజిలీకథలు - మూడవభాగము
సునీతి కథ
సునీతి ప్రాతివత్యంబునఁ జంద్రమతింబోలినదగుట నాగుట్టు బయలుబెట్టక, తోడికోడం డెప్పుడేని, అక్కా! నీవొక్కమాటైన మామఱది నీవలకు రానీయవే చక్కగా వశపఱచుకొంటివి. అన్నలకన్న నతండే బుద్ధిమంతుఁడు. నీఅదృష్టము మంచిదని స్తుతిచేయ మనంబున సిగ్గుపడుచు రానినవ్వు దెచ్చుకొని వారికిఁ దగిన ట్లుత్తరమిచ్చునది. ఉత్తమాంగనలు పతులకుఁ దమయెడ నిష్టము లేకున్నను వారిం జులకన సేయరు.
ఇట్లు కొన్నిదినంబుల చనిన నొకనాఁడు సునీతి పరిచారిక భ్రమరిక అనునది ఏదియో యాకు దీసికొనివచ్చి సంతోషముతో సాయింతి కిట్లనియె.
అమ్మా! నీవు మిగుల సుందరివి. విద్యాశాలినివి, సుగుణవతివి, యిట్టి నీకనుకూలవాల్లభ్యము లభించియు సౌఖ్యము లేకపోయినది. పతి మిగుల చక్కనివాడఁట నేను జూడవలయునని యెన్నియో ప్రయత్నములు చేయుచుంటిని కాని నాకుఁ గనంబడకున్నాడు. ఎప్పుడువచ్చునో, యెప్పుడు పోవునో తెలియదు. అందఱు నీకడ నున్నాడని తలంచుచున్నారు. ఈ రహస్యము వారియాప్తులతోఁజెప్పి మందలింపఁ జేయవలయునని తలంచినను నీ వొప్పుకొనవు ఈవార్త మీతండ్రి వినిన నెంత కోపింతురు. నీకతంబున నాకేమియుం దోచకున్నది. నేను నీతోఁ బెనగినదానవగుట నింత చింతింపుచుంటిని. నేఁటి యుదయుమున నేనిందలి దేవాలయములోనికిఁ బోయితిని. అందు జటావల్కముల ధరించి రెండవ శంకరునివలె నొప్పుచు జపముచేయుచున్న యొక సిద్ధుండు గనంబడెను.
ఆయ్యతిపతిరూపము చూచినవారికి మహానుభావుండని తోచకమానఁదు. నేనును గొంతుసే పందుండి అందఱు వెళ్ళినతరువాత, నతని పాదంబులంబడి మహాత్మా! నీవు సామాన్యసిద్ధుండవుకావు. సర్వజ్ఞమూర్తివి, దయాశాలివి, పరోపకారపారీణుఁడవు. మీవంటి మహాత్ములు లోకంబుల రక్షించుకొఱకే దేశయాత్రచేయుదురు. నాదొక విన్నపముగలదు విని ప్రతిక్రియ చేయుదురను తలంపుతో వచ్చితిని మీరెరుంగని మంత్రములు తంత్రములు లేవు. నా మిత్రురాలొకతె యుత్తమగుణములు గలిగియు బతిచే నవమానింపఁబడినది. అతండు వేశ్యాలోలుండై యా లోలాక్షి గుణంబుల గణింపకున్నవాఁడు, దీని కెద్దియేని వశ్యౌషధము మీయొద్ద నుండకమానదు. ఆ దంపతులం గూర్చితిరేని మీకీర్తి శాశ్వతమై పుడమినుండుటయేకాక పారలౌకికసౌఖ్య మధికముకాఁగలదు. రక్షింపుఁడని పలుకుచుఁ బాదములు విడువక అతండడిగిన నీవృత్తాంతమంతయుఁ గ్రమ్మఱజెప్పితిని.
అప్పు డతనికి మిక్కుటమగు నక్కటికము హృదయంబున బొడిమినది హరినామస్మరణచేయుచుఁ దనబరణిలో దాచియుంచిన యీయాకుదీసి యిచ్చి, మచ్చెకంటీ! దీన పసరు దీసి నీవయస్య మగనిమేన నెచ్చటఁ దగిలించినను వశ్యుఁ