పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(15)

విద్యావతి కథ

121

పౌరులు -- పదిరూపాయ లిచ్చినదిగదా. ఇంకేమి; దానినింకా నిందిస్తారేమి.

బ్రాహ్మణులు - పదిరూపాయ లొకలెక్కా! శాకదానము బట్టిన శంభన్న వెధవగాడికి వేయిరూపాయలు ముట్టినవి. మాకర్మముగనుక యేదియు దొరకినదికాదు దానమిచ్చే లంజముండ అందఱిని సమముగా జూడవద్దూ రండవని క్షౌరమైనదిలెండి తనయిల్లు పురోహితున కిచ్చినది. ఆతం డీరాత్రియే గృహప్రవేశ ముహూర్త ముంచుకొనియెను. రేపు మూఢమి వచ్చునట. ఈరాత్రియే యా యింటిలోనుండి లేచి వెళ్ళగొట్టును. రేపటినుండి వీథుల తిరిపెమెత్తవలయు మమ్ముల నుసురుపెట్టినందులకు గూడు గుడ్డలకు మొగమువాచునులెండి అని దీవించుచు బోయిరి.

అట్లు రత్నావతి పుత్రికతోగూడ దనయైశ్వర్య మంతయు జాముప్రొద్దు పోవువఱకు బ్రాహ్మణులకు బంచిపెట్టి తమ్ము ననుసరించియున్న పరిచరులకు జాలినంత విత్త మిచ్చి యిష్టులతో జెప్పదగినరీతిం జెప్పి మహావిరక్తురాలివలె నొప్పుచు తన కాప్తులైనవారితో దన పయనంపు తెఱఁగు రహస్యముగా నెఱిగించియు వారు దుఃఖింప దాను వైకుంఠముననుండియు మిమ్ములఁ బరామర్శింపుచుందు నని యోదార్చుచు సమయ మయ్యెనని కూఁతురు దొందర పెట్టుచుండ రెండడుగులు నడిచి వెండియు నెద్దియో జ్ఞాపకమువచ్చి గదిలోపలికిఁ బోయి విరామము వీటితో నీకేమి రమ్ము రమ్మని విద్యావతి జీరుచుండ నెట్టకేల కాయిల్ లువదలి యామేడమేదకు బోయి తనతో వచ్చు వారిం దూరమునంద వారించి నటులు అంతరిక్షము జూచుచు శ్రీహరి రాక వేచియుండెను.

అంతలోఁ గందర్పుండు వింతగా అలంకరించుకొని యాజింక నెక్కి అంతరిక్షమార్గమున నామేడమీదకు వచ్చి చేరెను. రత్నావతి దాదులందఱు వారిరువురు వైకుంఠమునకుఁ బోవు ప్రయత్నముతో నున్నారని గ్రహించి మూలమూలనుండి శ్రీహరిరాకఁ జూచుచుండిరి.

అట్లు మేడమీఁద వ్రాలిన కందర్పుం జూచి అనుమానమునందుచు గూతు మూలమున నేమియు మాటాడక రత్నావతి చేతులు జోడించి స్తుతిచేయ దొడంగినది. తల్పగతుడైన అతని యొద్దకుఁ దల్లిని దీసికొనిపోయి విద్యావతి మ్రొక్కించి నమస్కరించి యిదియే మీదాసురాలు నాతల్లి, మీరు చెప్పినరీతి సర్వము బ్రాహ్మణాధీనము గావించి పయనమునకు సిద్దముగా నున్నదని చెప్పెను.

అప్పు డతండు శిరఃకంపము సేయుచుఁ గానిమ్ము నేఁటికి బూతురాలయ్యె. వైకుంఠమునకుఁ దీసికొని పోయెదనులే యిరువుర నొకసారి వాహనముమీదఁ గూర్చుండబెట్టుకొనుట గష్టము. నిన్నుముందుగా దీసికొనిపోయెద రమ్మని చెప్పెను.

అదియు అందులకు సమ్మతించి ప్రయాణమునకుఁ దొందరపెట్టుటయు అతండు వేచి యాజింకను రహస్యముగా బూరించి యెక్కుమని చెప్పిన అప్పొలఁతి దేవా నేను ముందుఁ గూర్చుండనా వెనకఁ గూర్చుండనా అని పలికెను.

పూర్వము మనోరమయు నాజింక నెక్కునప్పు డారీతినే పలికెను. కావునఁ