పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యావతి కథ

117

వెంకట - ఛీ ఛీ! నోరుమూయి. నేను మహిషదానము పట్టెదనా? అన్నా? ఏకవాహనము తినే విస్సిగారికి యజ్ఞముచేయడముతోనే యెంతపొగరు వచ్చినది.

విశ్వేశ్వర - ఏమని కూయుచున్నావూ? విస్సిగాడా? దవడపండ్లూడును. జాగ్రత్త! పొత్తర్లజాబులంతా యజ్ఞములుచేయుటచేతనే కాల మీలాగుననున్నది.

పెద్దన్న - మీరు గ్రుద్దులాడేయెడల యిరువురు దూరముగా బొండి. మీ సంస్కారములు నేనెరుంగనివికావు పాక తగలవేయడముతోనే గొప్పవారమని విఱ్ఱవీగుచున్నారు. ఒక్కరియింటిలో అగ్నిహోత్రములు లేవు. నోరుమూసికొని నేను చెప్పినట్లు వింటారా వినండి లేకుంటే తిలదానమైన నిప్పించేదిలేదు.

బుచ్చెన్న -- సోమయాజులు - పెద్దన్నా ! వీరిలో నీవెఱుంగనివారులేరు. నీ యిష్టమువచ్చినట్లు వ్రాయించు.

పెద్దన్న -- లక్ష్మణకవిగారూ ! అహితాగ్నులైనారు. ఇంక అవధానులు పద్దులు వ్రాయండి ఘనాపాఠీలు మూడువందలు.

లక్ష్మణ - వ్రాసినాను.

అప్పావధాని --- పెద్దన్నా! క్రమాంతమైనను పూర్తిగాని యీ సుబ్బన్నను ఘనాపాఠీలలో వ్రాయించినా వేమి? నీకు బంధువుడు కాబట్టియా? వాడిమాత్రము పనసవచ్చినవారు చాలామందియున్నారు వాళ్ళనుకూడా వ్రాయించు.

సుబ్బన్న – ఇచ్చేది భోగముదియుండగా మధ్యను నీపుట్టేమి మునిగినది. పెండ్లామును వంచుకోలేవుగాని యీలాటితగవులు పెట్టగలవు. ఘనలో నేమి యున్నది? సరిగమపదనిస లాగున నీవిద్యావతిని చెప్పుమంటే చెప్పుతుంది.

పెద్దన్న - లక్ష్మణకవిగారూ! వీనిమాటలు మనము వింటిమా మూడురోజులకు సాగదు. ఆధ్యయనపరుల పద్దులైనవి పేరిశాస్త్రిగారు మా గొప్పవారు వ్రాయండి.

పేరిశాస్త్రి - పెద్దన్నమాటకేమిగాని యున్నవారిం జూడు పొత్తర్ల బాబులు కూడ అయినతరువాత వ్రాయవచ్చునులే.

పెద్దన్న -- అట్లనుచున్నా రేమి? యిప్పుడు వాయించినవారు తక్కువవారా?

పేరిశాస్త్రి -- కుచ్చలకథలాగున వేదముపాడితే సరియా? ఎక్కడను క్రొత్తకుండ తడపనీయకుండా అష్టాదశవర్ణముల యిండ్లకు తిరిగేవారు కొందరు. పునహావతారాలు తిరిగేవారు కొందరు. తీర్థకాకములు లాగున రేవులలో దిరిగి నీరుకాసులు పట్టేవారు కొందరు. ఈలాటివారి నందరిని ముందు పేర్కొని యిప్పుడా నాజమ-- మామా సంస్థానములకు సైతము పిలిచినంగాని పోనే! యిచ్చటికి నేను రాదగినదా యేమో అద్భుతముగా అందరు చెప్పుకొనుచుండగా జూతమని వచ్చితిని గడేకారీ సజ్జులలో మామర్యాద జూచువారుందురా.

జగన్నాధావధాని - యేమి? వేదము కుచ్చలకథా! యంత సారస్యముగ్రహిం