పుట:Jyothishya shastramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కాలచక్రము -15వ పటము

గల మొదటి పక్షములోనికి చేరుచున్నారు. 6,7 స్థానాధిపతులైన బుధ, శుక్రులు రెండవ ప్రతిపక్షములో చేరుచున్నారు. ఇక 8,9 స్థానములను చూచితే ఆ స్థానాధిపతులైన భూమి, కేతువు, గురు, కుజ చంద్ర రవి గ్రహముల పక్షమున చేరిపోవుచున్నారు. 10,11స్థానముల అధిపతులైన రాహు, శని గ్రహములు; మిత్ర, చిత్ర, బుధ, శుక్రగ్రహముల పక్షములో చేరిపోవు చున్నారు. ఈ విధముగా 2:1 లేక సరి, బేసి అను సూత్రము ప్రకారము ‘12’ గ్రహములలో ఆరు గ్రహములు శాశ్వితముగా ఒక పక్షములో ఉండగా, మిగత ఆరు గ్రహములు శాశ్వితముగా ప్రతి పక్షములో ఉండును.