పుట:Jyothishya shastramu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధముగా 27 నక్షత్రముల యొక్క 108 పాదములకు (భాగములకు) 108 అక్షరములను గుర్తులుగా పెట్టడము జరిగినది. కొందరు జ్యోతిష్యులు ఒక నక్షత్రములో పుట్టిన వానికి ఆ నక్షత్రములోని అక్షరములను ముందరయుంచి పేరును పెట్టడము జరుగుచున్నది. ఉదాహరణకు చిత్త నక్షత్రము మూడవ పాద సమయములో పుట్టినవానికి ఆ నక్షత్రము యొక్క మూడవ అక్షరమైన "ర" తో మొదలగు పేరైన రంగయ్య, రమేష్‌, రాము అని పేరు పెట్టుచున్నారు.

27 నక్షత్రములు 108 పాదములుగా విడిపోయి 108 అక్షరముల గుర్తులుగాయున్నవి. పన్నెండు లగ్నములలో 108 పాదములు ఎలా ఇమిడి యున్నవో ఇప్పుడు గమనిద్దాము.