పుట:Jeevasastra Samgrahamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మృదురోమములు గలవై యున్నవి (22-వ పటములో C. D. చూడుము). కొంతకాలమునకు బీజాశయము పైవైపున పగిలి సూక్ష్మబీజములన్నియు వెలువరింపబడును (B). ఈ సూక్ష్మబీజములన్నియు చెదరి నీటిలో నీదులాడుచుండును.

స్థూల బీజాశయములు.

సామాన్యముగా సూక్ష్మబీజాశయములుగల మొక్కమీద స్థూలబీజములును కొన్ని యుండును. ఈనాచుజాతిలోని కొన్నిమొక్కలందు ఒక్కొక మొక్కమీద సూక్ష్మబీజాశయములు మాత్రముగాని, స్థూలబీజాశయములు మాత్రము గాని యుండును. ఇట్టి మొక్కలు ఏకాంగులు? సూక్ష్మబీజాశయమువలెనే స్థూలబీజాశయమును మొట్టమొదట నొక కణముల రాసి. ఇది 23-వ పటమున చూపిన త్ళొకవిధమైన కూజావంటియాకారము గలదై, గుండ్రనైన మట్టు అను క్రిందిభాగమును, మధ్య పొట్టయు, పైభాగమున మెడయు గలదిగా