పుట:Jeevasastra Samgrahamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లన్నియు జేరి బీజాశయముమధ్య తెల్లని దూదిపింజెవలె చుట్ట చుట్టుకొనియుండును.

ఈ బీజతంతువునందలి కణములు మొదట బూజుపోగులోని కణములవలె నున్నప్పటికిని బీజాశయము ఫలించుతరికి ప్రతికణములో పాముచుట్టవలె చుట్టుకొనియున్న సూక్ష్మ (మగ) బీజ మొకటి యుండును. ఈసూక్ష్మబీజమునకు 20-వ పటములలో C-లో జూపినప్రకారము ఒకకొనను లావుగ నుండు తలయును, రెండవకొనను సన్నని రెండుతోకలు నుండును. బహుశ: నిజమయినబీజము తలనుండి తోకలవరకు నుండు భాగమే. ఈ భాగము కణముయొక్క జీవస్థానమునుండియు, మిగిలినతోకలు మూలపదార్థమునుండియు గలిగినవని తోచుచున్నది. పై జెప్పిన రెండువందల బీజతంతువులలో ప్రతిదానిలో నూరు లేక 200 లు సూక్ష్మబీజకణము లుండును. ప్రతికణమున నొక సూక్ష్మబీజ ముండును గాన ఒక్కొక బీజాశయమునకు 20 వేలు మొదలు 40 వేలవరకు సూక్ష్మబీజము లుండవచ్చును.

బీజములు పూర్ణముగా పెరుగునప్పటికి బీజాశయము పైబద్దలు ప్రత్తికాయ వీడినట్లుగా పగిలి లోపలి బీజతంతువులు ప్రత్తివలె పైకి వెడలును. అంతట నా బీజములు చెదరి బీజకణములను పగుల్చుకొని బయటబడి నీటిలో స్వేచ్ఛగా నీదు చుండును.