పుట:Jeevasastra Samgrahamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రము గొనుననియు చీకటివేళలయం దట్టిభోజనము సమకూడదు గాన జంతుభోజనము చేయుననియు నూహింపనగు.

రక్తాక్షివృక్షము; రక్తాక్షిజంతువు.

పై జెప్పబడిన యాహారవిధానములబట్టి రక్తాక్షిని వృక్ష శాస్త్రజ్ఞులు వృక్షములలో లెక్కింతురు. జంతుశాస్త్రజ్ఞులు దీనిని జంతువుగా గణింతురు. ఇది కేవలము వృక్షముగాక కేవలము జంతువుగాక మధ్యమజాతిలోనిదని చెప్పదగియున్నది. ఇట్టిజీవులింక ననేకములు గలవు. ఇవియన్నియు వృక్షములకును జంతువులకును మధ్యమావస్థలో నిలిచియుండి, వానికిగల సంబంధమును సూచించుచుండును.

సంతానవృద్ధి.

ఒకానొకప్పుడు రక్తాక్షి మృదురోమమును విసర్జించి, నిశ్చలనమునొంది, తనచుట్టును సెల్లులూసు గోడకట్టుకొని, కొంతకాలము విశ్రమించినపిదప ఆ గూటిని పగుల్చుకొని బయలు వెడలి చాక చక్యము నొందును. ఇట్టి విశ్రమస్థితియందురక్తాక్షి నిలువున రెండుగా చీలుటచే సంతానవృద్ధి గలుగుచున్నది (పటములో B. చూడుము). ఒకానొకప్పుడు తల్లిగూటినుండి పగిలి బయటబడకముందే ఒక్కొక చీలికయు రెండుగా చీలి నాలుగుపిల్లలు వచ్చును. ఇట్లె ఎనిమిదై నను గలుగుట గలదు.