పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగా ఉపాధ్యాయు డుంటాడు. కేథొలిక్కు పిల్లలను బడులలో కేథొలిక్కు పురోహితుడు బోధిస్తాడు. యూదు పిల్లలను ఆస్థలములో వారి పురోహితుడైన 'రబ్బీ" ఉంటే, తనికిన్ని, ప్రొటెస్టాంటు పిల్లలను ఆస్థలములోని ప్రొటెస్టాంటు పురోహిహునికిన్ని ఒప్పచెపుతారు. బడి పెద్దదయితే, బడిలోనే ఎల్లకాలమున్ను పనియేయడానికి ఒకనిని నియమిస్తారు. మతేతర విషయాలను బోధించడానికి వారి వారి మతములతో నిమిత్తము లేదు.

ఈ ఏర్పాటును కేథోలిక్కు పురోహితులు ఒప్పుకోక, ఈ సిమల్టెన్ షూలెను గర్హించి పిల్లలను ఆ బడులలోనుంచి తీసివేయవలసినదని తేల్లి దండ్రుల కుద్భోదము చేయడము ప్రారంభించి నారు. ఈ బడులు మతము పోషించేవి కావనిన్ని, వాటిలో భూగోళ శాస్త్రము, చిత్రలేకనము, సంగీతము, మొదలయిన విషయాలను రోమను కేథోలిక్కు మతము ప్రకారము నేర్పలేదనిన్ని, వీరి ఆక్షేపణము. 1922 సం.రము జనవరి


42