పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యములే కాకుండా, మాధ్యమిక పాఠశాలలో ఒకటిగాని ఎక్కువ గాని పరదేశ భాషలను చిఠ్ఠాఆవర్జాలు వ్రాయడమున్ను, పదార్థ విగ్నాన శాస్త్రము, రసాయన శాస్త్రము , కొన్ని బడులలో జీవ శాస్త్రము, రసాయిన శాస్త్రము నేర్పుతారు. సామాన్య విషయములను బోదించే పద్ధతిలో కూడ భేదమున్నది. ప్రాథమిక మాద్యమిక పాఠశలలను స్థానిక ప్రభుత్వమువారే పరి పాలిస్తారు. మూల ప్రభుత్వము వారు వారికి గ్రాంటులిస్తారు. ఆ పాఠశాలల లోని ఉపాధ్యాయ్ల సంఖ్యను బట్టిన్ని, పిల్లల సంఖ్యను బట్టిన్నీ గ్రాంటు ఉంటుంది గాని బడులకన్నిటికిన్ని మొత్తముగ్రాంటు ఉండదు. ఈ పద్ధతి ప్రకారము ఒకొక్క తరగతిలో చాల ఎక్కువమంది పిల్లలను చేర్చుకోనడముగాని, కావలసినంత మంది కంటే ఎక్కువమంది ఉపాధ్యాయులను నియమించడముగాని జరుగదు. ఈ మాద్యమిక పాఠశాలలోని పిల్లలను పూర్వము యూనివర్సిటీ లలో చేఎర్చుకొనేవారు కారు. కాని 1902 సం. మున ఈ అడ్డంకిని తీసివేసినారు. ఇప్పటి విద్యా క్ర

33