పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేతగాని చెడిపోయే పిల్లలకున్ను, మాత్రమే ఈ కింటర్ గార్టెన్ బడులు పనికి వస్తవి. ఆరేళ్ల లోపు పిల్లల యెదుట దేశ పటములుంచి వ్రాత, చదువులను నేర్పి, వారి మనస్సులలో ఆయా విషయములను క్రుక్కకూడదు. ఆయా ఆటలను ఉపాధ్యాయినులే ఏర్పాటు చేయవలెను. అని సాధారణముగా పిల్లలు బడులలోను బయటను చూచేవిగానె ఉండవలెను.

పిల్లల మొత్తము సంఖ్యలో నూటికి ఇరవై ఇద్దరు ఈ కింటర్ గార్టెన్ బడులలో చదువు కుంటారు. కాని, ఈ బడులలో చదువుకొనే పిల్లల కంటే, ఇంటివద్ద చదువుకొనే పిల్లలే ఎక్కువ తెలివి తేటలుగలవారని తెలియవస్తున్నది.