పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్తారు. బడి వదలి పెట్టిన బాలుడు గాని, బాలిక గాని, జీతము లేకుండా ఏదయినా ఒక కార్ఖానలో అని చేయవచ్చును. కాని, పై గెసెల్లె పరీక్ష ప్యాసయితేనే గాని జీతమివ్వరు. "ఆచార్య " పట్టాను పొందితేనే కాని స్వంతముగా ఒక వృత్తిని అవలంబించడానికి వీలు లేదు.


ఇక పదేళ్ళ వయస్సున ఉన్నత విద్యాలయాలలో చేరే పిల్లలను గురించి అలోచించుదాము. ఉన్నత విద్యాలయాలలో (High school) తొమ్మిదేండ్లు చదువుకోవలెను. సాధారణముగా పంతొమ్మిదోయేట పిల్లలు ఈ బడిలోని తుది పరీక్షను (Abturicoten) ప్యాసవుతారు. అప్పుడు వారు కళలు, విద్ద్యలు, శాస్త్రములు, వృత్తులు, నేర్పే విశ్వవిద్యాలయాలలో చేరుతారు. ఇంజినీరింగు, వర్తకము, వ్యవసాయము, అడవులు, వీటిని గురించి చెప్పే కళాశాలలు ప్రత్యేకముగా ఒక్కొకటి ఒక్కొక విశ్వవిద్యాలయమై ఉండి సాధారణ పట్టాలను, డాక్టరు బిరుదమును కూడ ఇవ్వవచ్చును. "అబ్ట్యురిఎంట్న్ "(Abituri-


14