పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కడ మూడేండ్లు చదువుకొని విశ్వవిద్యాలయమునకు పోవచ్చును.

(2) లేదా, వారొక దుకాణములో గాని ఒక పారిశ్రామిక సంస్థలో గాని చేరి, పని నేర్చుకొంటూ, మూడేండ్లు ఒక వృత్తి విద్యాలయ్తములోనో, ఒక పారిశ్రామిక విద్యాలయములోనో, చదువుకొన వచ్చును.

(3) వారు ఒక వృత్తి విద్యాలయములోనో పారిశ్రామిక విద్యాలయములోనో చేరి, తమ కాలమంతా అక్కడనే వినియోగింప వచ్చును.

ఈ వృత్తి బడులలో పుస్తకవిద్య, అనుభవ విద్య కూడ నేర్పుతారు. ఆచదువు అయిన తరువాత, 'గెసెంల్లె ప్రుపుంగు "(Gesselle prufung) అనే పరీక్ష ప్యాసు కావలెను. మంచి పనివాళ్లుండే కొన్ని ఖార్కానాలలోనికి ఈ పరీక్ష ప్యాసయిన వారినే చేర్చుకొంటారు. అక్కడ మరి మూడేండ్లు అనుభవము కుదిరిన తరువాత తిరిగి ఒక పరీక్ష జరుగుతుంది. అందులో ప్యాసయిన వాళ్ళకు ఆచార్య (Master) అనే పట్టా యి


13