పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బించవలెననిఉంటే జీతేము లేకుండా ఆ వృత్తిని నేర్చుకొంటూ మూడేండ్ల వరకున్ను ఒక పారిశ్రామిక విద్యాలయమునకో ఒక వృత్తి విద్యాలయమునకో పోవలెను. ఆ మూడేండ్లున్ను చదువయిన తర్యాత ఒక వృత్తికి సంబంధించిన పరీక్ష జరుగుతుంది. దానిలో కృతార్థులైతే జీతము గల ఒక ఉద్యోగము దొరుకు తుంది. ప్రాథమిక పాఠశాలలో చదువు కొన్న వ్యవసాయ దారుల పిల్లలు కూడ ఉన్నత గ్రామ విద్యాలయమ్లకు పోవలెను. వాటిలో వ్వవసాయము నేర్పుతారు. దుకాణము మీద ఉండే పిల్లగాని, పొలము మీద కూలి చేసుకొనె వారు గాని పద్నాలు నుండి పదిహేనేండ్లు వయస్సు వచ్చే వరకున్ను ఒక వృత్తి విద్యాలయము నకు పోయి తీరవలెను.


మాధ్యమిక పాఠశాలలలో పదేండ్ల వయస్సున చేరే మగ పిల్లలు, ఆడ పిల్లలు కూడ వాటిలో ఆరేండ్లు చదువుకొన్న తరువాత ఈ క్రింది రీతిగా చేయ వచ్చును.

(1) వారొక ఉన్నత పాఠశాలలో చేరి,


12