పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదేండ్ల వయస్సప్పుడు పిల్లలను మూడు తరగతులుగా ఏర్పాటు చేస్తారు. (1)ధనవంతులైన పిల్లలు ఉన్నత పాఠశాలలకు పోతారు. ఇక్కడ వారు జీతము చెల్లించవలెను. ఈ బడులలో తొమ్మిదేండ్లు చదుకోవలెను; పందొమ్మిదోఏటా అభ్ట్యూరియెంటెన్ (Abiturienten) అనే స్కూలుపైనలు పరీక్షలో కృతార్థులై ఏదో ఒక విశ్వవిద్యాలయములో చేరవచ్చును. (2) అంత ధనికులు కాని పిల్లలు, మెట్టెల్ షూలె (Mittel schule) అనే మాధ్యమిక పాఠశాలలలొ చేరుతారు. ఈ బడులు ఉత్తమ తరగతిలో చేరిన బోర్డు స్కూళ్ళయి ఉంటవి. వీటిలో పది నుండి పదహారోయేడు వయస్సువరకూ ఆరు సంవత్సరములు చదువుకోవలెను. కాని, తెలివి గల పేదవిద్యార్థులకు నూటికి పదిమంది వంతున ఉచితముగానే విద్య నేర్పుతారు. (3) తక్కిన పిల్లలు మొత్తము పిల్లల్లో మూడు వంతులలో రెండు వంతుల మంది ఉంటారు. వీరు పధ్నాలుగేండ్ల వయస్సువరకు

10