పుట:Jagattu-Jiivamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నది. అందుచే నీ గ్రంధమునందు ప్రతిపాదితములైన విషయములుకూడ ప్రమాణముగ నంగీకరింపవచ్చును.

మరియు నీపుస్తకము మృదుమధురముగను, సరళముగను నుండుటచే ఆంధ్రులెల్లరును దీనిని పఠించి ప్రకృతిశాస్త్రమున తగు పరిజ్ఞానమును, విశ్వస్థితి, మండలములయొక్కయు, తదంతరాళముల యొక్కయు పరిమాణమును, విశేషించి సూర్యచంద్రాదుల గమనము యొక్కయు, పరిమాణముయొక్కయు సత్యమైనజ్ఞానమును, జీవుని స్వరూపము ఉత్పత్తిమరణములు, సంసారావస్థ, ఆనందావస్థ మొదలగు విషయములయొక్క యధార్థ జ్ఞానమును సులభముగ నీగ్రంధరత్నమువలన సంపాదించి యానందింతురని నాయాశయము.

ఈ విధమగు గ్రంథరచన బహు గ్రంధరచయితలగు వీరికి క్రొత్త సంగతికాదు. కాన వీరి యీ మహోద్యమఫలితములగు నిట్టి గ్రంధరాజములచే నాంధ్రభాషాయోషను భూషించుటకై వీరికి పరిపూర్ణాయుర్దాయము నొసగు గావుతయని పరమేశ్వరుని ప్రార్ధించు చున్నాడను.


మహామహోపాధ్యాయ, న్యాయభూషణ

పేరి లక్ష్మీనారాయణశాస్త్రీ,

శ్రీ విజయనగర మహారాజ సంస్కృత కలాశాలా

రిటైర్డ్ హెడ్ పండిట్.