పుట:Himabindu by Adivi Bapiraju.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కడకుచేరిన భిక్షుకులు:

“నమచ్ఛాక్యమునయే
తథాగతాయ అర్హతే
సంయుక్ సంబుద్ధాయ”

అని పాడిరి.

22. అఖండభూవలయు సామ్రాజ్యాభిషేకము

“అగ్నిఃపూర్వేభికృషిభిరీధ్యో నూతనైరుత స దేవా ఏహవక్షతి.”

అను మంత్రముచే అగ్ని ప్రజ్వరిల్లుచుండెను. మహర్షులు మంత్రములు చదువుచుండిరి. స్థౌలతిష్యమహర్షి వసిష్ఠు డయ్యెను.

“ఇంద్ర స్యను వీర్యాణి ప్రకోచం యాని చకార ప్రథమాని వజ్రీ
అహ న్నహీ మన్వప స్తదర్ద ప్రవక్షణా అభినత్పర్వతానాం”

ఇంద్రమంత్రములైనవి.

“తత్పూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యా కర్తరి తతం సంజ
భార య దేత దయుక్త హరితః సదస్థా దాద్రాత్రీ వాసస్తను తే సి మస్మై.”

సూర్యుని పూజించినారు. సర్వదేవతలను అర్చించినారు.

“నా విష్ణుః పృధివీపతిః” గావున విష్ణు నట్లర్చించిరి.
“ఇవ ద్విషోః పరమం పదం సదా సశ్వంతి సూరయంః దివీవచక్షు
రాతతంǁ త ద్విప్రాసో విపన్వవో జాగృవాం సః సమింధతే విష్ణోర్య త్పరమం పదంǁ”


చక్రవర్తి సింహాసన మహావితర్దికకు దిగువను ఒక సామాన్య సింహాసనముపై శ్రీముఖసాతవాహనుడా శ్రావణశుద్ధ పంచమినాడు, ఉత్తరఫల్గుణీనక్షత్ర తృతీయ పాదయుక్త కన్నాలగ్నమునందు, సింహాసనారూఢుడు కా సముచితాలంకారుడై అధివసించియుండెను.

కర్కాటకమున రవియు, దశమమున బుధశుక్రులును, మీనము నందు గురువును బలవంతులై యుండి, చంద్రుడు లగ్నమందుండెను.

ఈ మహాముహూర్తమునందు సింహాసనాభిషేకము నేర్పాటు చేసినాడు స్థౌలతిష్యుడు. అంతకుముందునుండియు అనేకహోమములు జరుగు చున్నవి.

పాటలీపుత్రము దేవనగరివలె నలంకరింపబడెను. మగధ దేశమంతయు నలంకరింపబడెను. ధాన్యకటకమహానగరము వైకుంఠమే ఆయెను.

ఆంధ్రదేశమంతయు పండుగలే! సకలభూవలయము మహదాంధ్ర దేశమయినది వారికి.

మహదాంధ్రసార్వభౌముడు హరిశ్చంద్రాది మహాచక్రవర్తుల వంశములోనివా డైనాడు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 291 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)