| కుహుకుహూ కుహుకుహూ | |
పికాంగన: | శారదావల్లకీతంత్రీస్వనము నేను | |
కృష్ణానది: | ఔనే వనప్రియా! | |
భృంగము: | జుం జుం జుం ! భం భం భం ! | |
సంధ్య: | కృష్ణవేణీ నీలిమలు, కో | |
12. కృష్ణవేణీ తీరము
సువర్ణశ్రీకుమారుడు హృదయము దడదడ కొట్టుకొన సమశ్రుతి నందిన సంధ్యాకాశమును, నదీప్రవాహమును చూచుచు ఆ వనము ప్రవేశించినాడు. కృష్ణవేణి వినీల జలంబుల నెరసంజ ప్రతిఫలించుట నాతడు చూచెనో, లేదో! కోకిలామధురగీత మతడు వినలేదు. మల్లెలు, శేఫాలిక, హేమపుష్పము, అతి ముక్తము, జాజి, మాలతి, మాధవి, నవమాలిక, కుందము, కరవీరము విరియబూచి యున్నవి. ఆతడు వానిదెస చూడలేదు. అతనికోర్కె ఎఱ్ఱనైనది. అతనిగండఫలకములు చిరుచెమ్మటలు వోసినవి.
అడివి బాపిరాజు రచనలు - 2
• 108 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)