పుట:Haindava-Swarajyamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
78

హైందన స్వరాజ్యము.


హములు జరుగుచున్నవి. పండ్రెండేండ్ల బాలికలు బిడ్డలగని సంసారము బరువు మోయుచున్నారు. స్త్రీలు బహుభర్తృకలును కలరు. నియోగములు నడచుచు నేయున్నవి. మతము పేరు పెట్టి స్త్రీలు వ్యభిచారమును వృత్తి చేసికొనుచున్నారు. దేవతలకు ప్రీతి యని మేకలు గొర్రెలు హతమగుచున్నవి. మీరువర్ణించిన నా గరకమున కివి గూడ చిహ్నములనియే ఈయభిప్రాయమా?


సంపా: మీరు చెప్పునది సరిగాదు. మీరు చూపిన లోప ములు లోపములే. అని పూర్వనాగరకమునకు చెందినవని యెవ్వ రును భ్రమపడట లేదు. దానిశక్తిని ప్రతిఘటించికూడ అవినిల చినవి. వానిని నశింప జేయుటకు ఎల్లప్పుడును ప్రయత్నములుజరి గినవి, జరుగుచున్నవి, జరుగగలవు. మనయందుద్భవించిన నవీ న తేజముచే ఈదోషములకు పోనాడుకొనుటకు ప్రయత్నింప వచ్చును. నవనా గరక చిహ్నములని నేను వర్ణించిన దంతయు దానిచిహ్నములే యని తద్భక్తుత లే యంగీకరించుచున్నారు. ఏ నాగరకము క్రింద గాని, ఏదేశములోగాని మానవుడు సంపూర్ణ త్వము సందినది లేదు. భారతనాగరకముయొక్క దృష్టి మానవు ని- నైతికస్వభావమును పెంచుట. నవనాగరకము యొక్క దృష్టి అవినీతిని అధికముచేయుట, దీనికి దైవభక్తి తోడు లేదు.దానికి -దైవభక్తియే యాధారము. ఈ విధముగా నాలో చించి ఈరీతిని విశ్వసింను ప్రతి భారతీయుడును తల్లి యురము వీడని శిశువువలె తన ప్రాచీన నాగరకమును వీడక నడుచుకొనవలెను.