పుట:Haindava-Swarajyamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
64

హైందవ స్వరాజ్యము.


న్యాయస్థానములలో వాదించి రక్షించిరి. వారు ఎంతో పొగ డిన దేశీయ మహాసభ న్యాయవాదులు పనిచేయకున్న రూపము తోనే యుండదు. ఇంతటివారగు న్యాయవాదుల తెగను. దూషించుట న్యాయము నన్యాయముచేయుటగా నున్నది. వారిని బూతులాడుటచే పత్రి స్వాతంత్ర్యమును అపవిత్ర మొనర్చు చున్నారు.


సంపా: ఒకప్పుడు నేను మివ లెనే అభిప్రాయపడియుంటిని. వారు యేమియు మేలు చేసినవారే కాదనీ ధృవపరచుట నా కవసరము కాదు. ఘోసుగారిని స్మరించి కొనిన నా కెంతో గౌరము. అతడు బీదలకు సాయపడెననుట నిజము. దేశీయ మహాసభ న్యాయవాదులకు కొంత ఋణపడి యుండుట సంభావ్యము. వకీళ్లు మనుష్యు లే. ప్రతి మనుష్యునిలోను కొంతగుణము కలదు. ఎక్కడెక్కడ వకీళ్లు మేలుచేసినారని చెప్పవచ్చునో అక్కడక్కడ ఆలోచించి చూచు నెడల వారి మానవస్వభావము అందులకు కారణముగా దోచ గలదు.వారి న్యాయ వాదిత్వముచే చేసిన మేలేమియు నుండదు. నేను మీకు తెలుపదలచు కొనునదంతయు ఇది. ఆవృత్తి అవినీతికి ఆకరము. అందులో దొరకు కొనినవారు దానిమోహమునుండి తప్పించు కొనుట యరిది.

హిందువులు మహమ్మదీయులు పోట్లాడుకొనినా రనుకొం దము. సామాన్యమానవుడు వారిని ఆ విషయమే మరచి