ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పదునొకండవ ప్రకరణము.
భారతభూమిస్థితి.
న్యాయవాదులు.
చదువరి: మీరనున దేమి? ఇరువురు పోట్లాడుకొనినప్పుడు
వారు న్యాయస్థానమునకు పోరాదా! ఇది చిత్రముగానే
యున్నది.
సంపా: మీరు చిత్రమున్నను మరియేమన్నను నేజెప్పినది
నిజము. ఈ వేసిన ప్రశ్న వలన మనము న్యాయవాదులను
గురించియు వైద్యులను గురించియు ముచ్చటింపవలసి యున్నది.
నాయభిప్రాయమున న్యాయవాదులచే దేశము దాసత్వమంది
నది. హిందూ మహమ్మదీయవి భేదములు 'పెరిగినవి. ఆంగ్లాధి
కారము స్థిరపడినది.
చదువరి: ఈ నేరములుమోపుట సులభము కాని ఋజువు
చేయుట మీతరముగాదు. న్యాయవాదులు కాకున్న మరి
యెవ్వరు మనకు స్వాతంత్ర్యమార్గమును చూపియుండగలరు?
బీదల నెవరు సంరక్షించి యుండగలరు? న్యాయము నెవరు
స్థాపించియుండ గలరు : ఉదాహరణార్థము, గతించిన మన
మోహన , ఘోసుగారు ప్రతిఫలముకోరక ఎందరనో బీదలను