పుట:Haindava-Swarajyamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

225

ద్వితీయ భాగము.

యేను బతి ప్రత నిల నై తినేని
భానుండు మింటను భాసిల్ల కుండు
నన విని బ్రహ్మాదు లద్భుతం బంద
నొనరంగ దిననాధుఁ డుదయింప నోడె...............................1160
నిది దివ మిది రాత్రి యిది సంధ్య యనుటఁ
దిదశుల కైనను దెలియ రాకుండఁ
దరుణి పతివ్రతాధర్మంబునకును
హరుఁడు ప్రసన్ను, డై యతికృపామూర్తి
“వరము వేఁడుము నీవు వనజాక్షి' యన్నఁ
గరములు మొగిచి యక్కళ్యాణి పలికె
'సర్వేశ వరము నీ శవమున కిమ్ము
పార్వతీనాథ నాపతిఁ గావు' మనిన
వామ దేవుం డిచ్చె వరము లిర్వురకు
భామ ప్రార్థింపంగ భానుండు వుడమె................................1170
గరకంఠుడరిగె నా కైలాసమునకుఁ
దరుణి పతివ్రతాధర్మ మిడే రె)*[1]
బాయని భ క్తీమై బతిపాద సేవ
సేయుటఁ గాదె ప్రసిద్ధికి నెక్కి
రాయరుంధతియును నా యహల్యయును
నా యనసూయయు నఖిలలోకముల

.........................................................................................................


యెను. భానుఁడు=సూర్యుఁడు,మింటను భాసిల్ల కుండు= ఆ కాశమున వెలుఁగకుం డుగాక -ఉదయింపకుండుఁగాక యనుఁట, దిన నాథుఁడు= సూర్యుఁడు, త్రిద శలు= దేవతలు, వామదేవుఁడు= శివుఁడు, గరకంఠుఁడు= శివుఁడు, ఏపరించుచు= ..........................................................................................................

  • ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతుల లేదు